మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా తెలంగాణ అంశం పై చర్చించినట్లు సమాచారం. మొన్నామధ్య తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ తెలంగాణలో ప్రజలు ఏమాత్రం తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు అనే అంశం గురించి సోనియాకు వివరించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో కిరణ్ ప్రభుత్వ పనితీరు, ఒక వేళ తెలంగాణ ఇవ్వని పక్షంలో ముఖ్యమంత్రిని మార్చవలసి వస్తే, దానిపై కూడా గవర్నర్ అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉండవచ్చని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా గవర్నర్ వివరించి ఉంటాడని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకులు... Read more
Sep 20 | కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల... Read more
Sep 20 | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా... Read more
Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్లోని విట్బర్న్కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్లో... Read more
Sep 20 | స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలన్న బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు తిరస్కరించింది. ప్రతినిధుల సభ ముందుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 98 మంది ఎంపీలు ఓటేయగా అనుకూలంగా 42... Read more