Pm speaks to karnataka cm

PM speaks to Karnataka CM,Cauvery River Authority, Tamil Nadu-Karnataka water dispute, water sharing issue

PM speaks to Karnataka CM

37.1.png

Posted: 09/20/2012 01:20 PM IST
Pm speaks to karnataka cm

PM speaks to Karnataka CM

కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది. కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రధాని ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి శెట్టర్‌ను ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాన్ని శెట్టర్ ధిక్కరించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో తమ రాష్ట్రం నుంచి చుక్క నీటిని కూడా తమిళనాడుకు వదలడం సాధ్యం కాదని సీఎం శెట్టర్ స్పష్టం చేశారు. కావేరీ జల వివాదం మళ్లీ ముదురుతున్నది. జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కావేరీ ట్రిబ్యునల్ సమావేశం విఫలమైంది.

కావేరీ నుంచి తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు రోజూ 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ప్రధాని ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి శెట్టర్‌ను ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాన్ని శెట్టర్ ధిక్కరించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో తమ రాష్ట్రం నుంచి చుక్క నీటిని కూడా తమిళనాడుకు వదలడం సాధ్యం కాదని సీఎం శెట్టర్ స్పష్టం చేశారు. ప్రధాని ఆదేశం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ప్రధాని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో కావేరీ బేసిన్‌లో వాతావరణం మళ్లీ వేడెక్కింది. పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు కర్ణాటక కావేరీ పోరాట సమితి అధ్యక్షుడు జి.మాదేగౌడ ప్రకటించారు. తమిళనాడుకు నీరు విడుదల చేసేందుకు తాము అంగీకరించబోమని ఆయన చెప్పారు. ప్రధాని తీరుపట్ల కన్నడ రైతు, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రధాని కర్ణాటకకు అన్యాయం చేస్తున్నారని విమర్శించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapeswaram laddu creates record
Ap governor meets sonia over telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Group politics in congress party

    Sep 20 | రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు మళ్లీ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రిని మార్చితే తప్ప కాంగ్రెస్‌ గాడిలో పడదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహతో మంత్రుల జానారెడ్డి, సారయ్య, డీఎల్ రవీంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు... Read more

  • Ap governor meets sonia over telangana issue

    Sep 20 | మన రాష్ట్రగవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన, పలువురు నేతలతో జరుపుతున్న భేటీలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటి అయ్యారు.... Read more

  • Tapeswaram laddu creates record

    Sep 20 | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో 6,300 కిలోల భారీ లడ్డూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గోదావరి పుష్కరఘాట్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ భారీ లడ్డూని ఏర్పాటు చేశారు. పర్వదినం సందర్భంగా... Read more

  • Geordie pantsman claims his world record back

    Sep 20 | ఇతడు సూపర్ మ్యాన్‌కే బాబులాంటి వాడు. ఎందుకంటే.. సూపర్ మ్యాన్ డ్రస్సు మీద ఒకే అండర్‌వేర్ వేసుకుంటే.. ఇతడు ఏకంగా 302 అండర్‌వేర్లు వేసుకున్నాడు! బ్రిటన్‌లోని విట్‌బర్న్‌కు చెందిన గ్యారీ క్రెయిగ్(53) సౌత్ షీల్డ్స్‌లో... Read more

  • Gay marriage bill is rejected by australian parliament

    Sep 20 | స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలన్న బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు తిరస్కరించింది. ప్రతినిధుల సభ ముందుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేసింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 98 మంది ఎంపీలు ఓటేయగా అనుకూలంగా 42... Read more