డ్రగ్స్ వ్యవహారంలో సినీమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడితో సిట్ అధికారుల విచారణ ముగిసింది. నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలో సుమారు ఐదున్నర గంటల పాటు ఆయన్ని విచారించారు. అయితే కొరియర్ ద్వారానే తాను డ్రగ్స్ తెప్పించుకునేవాడినని శ్యాం కె నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకు లేదని ఆయన మొదట్లో చెప్పినప్పటికీ, అధికారులు ఆధారాలు చూపించడంతో ఈ టాప్ కెమెరామెన్ అసలు విషయం చెప్పినట్టు సమాచారం.
డ్రగ్స్ సరఫరా దారుడు కెల్విన్ ని ఎన్నిసార్లు కలిశారని, అతనితో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. సినిమాల్లో షూట్ లొకేషన్ల కోసం చాలా పబ్స్ కు వెళ్లానని, పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లతో పరిచయాలు ఉన్నాయని శ్యామ్ వివరించాడంట. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా హైదరాబాద్ వదలి వెళ్లొద్దని సిట్ అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరో మారు విచారణకు హాజరుకావాలని శ్యాం కె నాయుడుకి అధికారులు చెప్పినట్టు సమాచారం.
కాగా, డ్రగ్స్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని, నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాలని కోరుతున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్ర వదన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆధారాలు లభిస్తే ఎవరిపైన అయినా సరే, చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదేం పెద్ద ఇష్యూ కాదు...
డ్రగ్స్ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిట్ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఈ అంశంపై స్పందించాడు. డగ్స్ కేసుల వల్ల సినీ పరిశ్రమకు వచ్చిన ప్రమాదమేమీ లేదని ఆయన అన్నారు. తప్పు ఎవరు చేసినా, వారికి శిక్ష తప్పదని తెలిపారు. డ్రగ్స్ కేసులతో సినీ ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెడుతోందనే వార్తలను ఆయన కొట్టిపారేశాడు. ఆ వార్తలన్నీ అవాస్తవాలే అని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని... ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుందన్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more