చేతులు కాలుతున్నాయని ఆకులు పట్టుకునే వారు కొందరు అయితే.. కాలుతుందని తెలిసి మంటను పట్టుకునేవారు మరికొందరు. ఈ రెండిటిలో దిల్ రాజు రెండవ కోవకు చెందిన వ్యక్తి. నిర్మాతగా బాగా డబ్బు సంపాదించి పేరు తెచ్చుకున్న దిల్ రాజు.., డిస్ర్టిబ్యూటర్ గా మారి నష్టపోయాడని తెలిసిందే. అయితే తాజాగా మళ్ళీ సహ నిర్మాతగా మారి లక్ పరీక్షించుకుంటున్నాడు. అంతటితో ఆగవచ్చు కదా... కుదరదు అన్నట్లుగా చేతులు కాల్చిన డిస్ర్టిబ్యూషన్ జోలికే మళ్ళీ వెళ్తున్నాడు.
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.., ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా రూ.14కోట్లు భారీ ఫ్యాన్సీ రేటుతో తీసుకున్నాడని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. ‘రేసు గుర్రం’ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరగటంతో అంత బడ్జెట్ పెట్టక తప్పలేదు అని రాజు సన్నిహితులు చెప్తున్నారు. ఇక్కడ సినిమా స్టామినాపై ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే అది అల్లు అర్జున్ మూవీ అందులోనూ మాటల మాంత్రికుడి చేయి పడింది. దీంతో హిట్ ఖాయం అని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న క్రైసిస్ లో ఇంత డబ్బు తెచ్చి పెట్టడం ఎందుకున్న వాదన విన్పిస్తోంది. ఇదే అవకాశం మరో డిస్ర్టిబ్యూటర్ కు ఇచ్చి.., నిర్మాతగా మరో సినిమాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది అని సలహా ఇస్తున్నారు. అయితే ఎవరి ఇస్టాలు, ఇంట్రస్టులు వారివి. ‘జులాయి’ లాగానే తాజా కాంబినేషన్ కూడా హిట్ అవుతుందని నమ్మకంతో ఇంత డబ్బు పెట్టేందుకు వెనకాడలేదు. దిల్ రాజు అనుకున్నది జరగాలని కోరుకుందాం. ఇక ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సీనియర్ నటి స్నేహ కూడా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more