దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిసాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాల కారణలతో పాటు అమెరికా సెంట్రల్ బ్యాంకు పెడ్ రిజర్వు త్వరలో ద్రవ్య పరపతి విధానంపై సమీక్షిస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలలో పయనించాయి. లాభాల స్వీకరణ అనంతరం ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపు కన్నా తక్కువగా ఆరంభమైన సూచికలు, ఆపై మరే దశలోనూ పుంజుకోలేకపోయాయి.
గత కొన్ని సెషన్లుగా 7,500 పాయింట్ల వద్ద మద్దతు కూడగట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నిఫ్టీ, ఈక్విటీల విక్రయాలతో ఆ స్థాయి నుంచి జారిపోయింది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 253.11 పాయింట్లు పడిపోయి 1.02 శాతం నష్టంతో 24,551.17 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 78.15 పాయింట్లు పడిపోయి 0.38 శాతం లాభంతో 7,538.75 పాయింట్ల వద్దకు చేరాయి.
బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.79 శాతం, స్మాల్ క్యాప్ 0.91 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 36 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, కెయిర్న్ ఇండియా, టెక్ మహీంద్రా, వీఈడీఎల్ తదితర కంపెనీలు లాభపడగా, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐడియా, సన్ ఫార్మా, టీసీఎస్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,801 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,011 కంపెనీలు లాభాల్లోను, 1,633 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. సోమవారం నాడు రూ. 92,04,276 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,28,465 కోట్లకు తగ్గింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more