విదేశాల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలు దేశీయ స్టాక్ మార్కెట్లను పతనం అంచున పయనం సాగించేట్లుగా చేశాయి. నిన్నటి బ్లడ్ షడ్ తరువాత కొలుకుంటుందని ఆశించిన మార్కట్లకు అసియా మార్కెట్ల ప్రతికూల పవనాలు దెబ్బతీశాయి. దీంతో 2014 మే 15 నాటి కనిష్టస్థాయికి మార్కెట్లు చేరుకున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలను చేపట్టని నాటికి మార్కెట్లు చేరుకున్నాయి. ఈ తరుణంలో భారత్ భవిష్యత్ లో మెరుస్తుందన్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కామెంట్లపై కూడా వార్తలు వినబడుతున్నాయి..
అసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలకు తోడు క్రూడ్ అయిత్ ధరల పతనం కూడా మార్కెట్ల కుదుపుకు కారణమైంది. దీంతో మదుపరులు అమ్మకాల మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు నష్టాలబాటలో పయనించాయి. ఉదయం మార్కెల్లు ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి వంద పాయింట్ల నష్టంతో 23 వేల 962 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 33 పాయింట్ల నష్టంతో 7, 279 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ క్రమంలో బీఎస్సీ బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీలకు చెందిన సూచీలు అధిక లాభాలను గడించగా, కన్జూమర్ డ్యూరబుల్స్, బిఎస్సీ ఐటీ, బిఎస్సీ టెక్నాలజీ, చిన్న తరహా పరిశ్రమల సూచీలు స్వల్పంగా లాభాలను ఆర్జించాయి. కాగా అటో, హెల్త్ కేర్, అయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ ఎం జీ సీకి చెందిన సూచీలు అత్యంతంగా పతనం కాగా, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, మద్య తరహ పరిశ్రమల సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, బ్యాంక్ అఫ్ బరోడా, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు అత్యధిక లాభాలను అర్జించగా, మారుతి సుజుకీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోల్ ఇండియా, ఐడియా సెల్యూలార్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో... Read more
Aug 09 | అధునాతన టెక్నాలజీతో అందరి మనస్సులను కొల్లగొడుతున్న ఐఫోన్.. అందరి ఊహాలకు అతీతంగా తన ఐఫోన్ 14 సిరీస్..ను ముందుగానే విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది నిజమని... Read more
Jul 19 | దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి పాతాళానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే తొలిసారి 80కి చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్లో 79.9863 వద్ద ప్రారంభమై తర్వాత యుఎస్ డాలర్తో రూపాయి ఆల్ టైమ్... Read more
Jul 02 | టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) తన తాజా మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ను ఆవిష్కరించడంతో అత్యంత పోటీతత్వంతో కూడిన మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. రాబోయే పండుగ సీజన్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఈ... Read more
May 28 | భారత్లో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతానికి పైగా పెంచుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ `బీఎండబ్ల్యూ` లక్ష్యంగా పెట్టుకున్నది. ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను భారత్లో ఆవిష్కరించింది. వాహనాల... Read more