దేశంలో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాల్లో కిన్నౌర్ హిల్ స్టేషన్ ఒకటి. చూడముచ్చటగా, ఎంతో అందంగా కనువిందు చేసే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పట్టుకుచ్చులాంటి ఆకుపచ్చని లోయలు, పంటకు వచ్చిన పండ్ల తోటలు, అందమైన ద్రాక్ష తోటలు తదితరాలు ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికే వన్నె తెచ్చాయి. ఇన్ని సౌందర్యాలను ఇనుమడింపజేసుకోవడంతో దీనిని ‘ది ల్యాండ్ ఆఫ్ ఫేరీ టేల్స్’ అని కూడా పిలుస్తారు. దేశంలో వున్న ఇతర సౌందర్య ప్రదేశాలకు, ఈ కిన్నౌర్ లో దాగివున్న అందమైన ప్రాంతానికి మధ్య ఎంతో వ్యత్యాసం వుంటుంది. అలాగే.. అక్కడి సంస్కృతికి మిగతా రాష్ట్ర సంస్కృతికి తేడా గమనించవొచ్చు. పర్యాటకులు ఇక్కడ బ్రహ్మాండమైన కిన్నౌర్ కైలాష్ పర్వతాన్ని కూడా చూడవొచ్చు. అంతేకాదు.. ఇక్కడ మరిన్ని ఆకర్షణీయమైన ప్రదేశాలు వున్నాయి. అవేమిటో చూద్దాం..
* నాకో సరస్సు : ఇది కిన్నౌర్ లోని ఒక చిన్న కుగ్రామమైన ‘నాకో’లో వుంది. ఈ సరస్సు సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ నాలుగు అందమైన దేవాలయాలు, అనేక చెట్లతో వుంటాయి. ఇక్కడ ఓ పాదంలాంటి గుర్తు వుంది. జానపద కథనం ప్రకారం.. అది న్యింగ్మ పాఠశాల వారిచే రెండవ బుద్ధుడిగా పిలువబడ్డ ‘గురు పద్మసంభవ’ పాదముద్ర అని అంటారు.
* హన్గ్రాంగ్ లోయ : ఇది ఈ ప్రాంతంలో వుండే రెండవ పెద్ద లోయ. ఇది టిబెట్, స్పితి సరిహద్దులుగా వున్న కిన్నౌర్ బోర్డర్ లో వుంది. ఈ భూభాగమంతా రాతి, బంజరు భూమి అయి వుండటం వల్ల ఇక్కడ వృక్షసంపద ఏమీలేదు. ఈ భూభాగమంతా కొండ ప్రాంతంగా ఉండటంవలన ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చాలా క్లిష్టమైన పని. ఆఖరికి పర్వతారోహణ నిపుణులు కూడా ఈ ప్రాంతంలో అధిరోహించలేరు. అయినప్పటికీ, ఈ లోయలో పర్వతారోహణ, పక్షుల పరిశోధన వంటి ఇతర సాహసోపేత చర్యలకు ప్రసిద్ధిచెందింది.
* చరంగ్ ఘటి : ఈ ప్రదేశం ‘సాంగ్ల వాలి’లో వుంది. దీని ఎత్తు 5242 మీ. దీనిని 1994వ సంవత్సరంలో పర్యాటకుల సందర్శనార్ధం ప్రారంభించారు. అప్పటినుండి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ స్థలంగా, ‘చరంగ్ ఘటి పాస్’ గా పేరుగాంచింది. అధిరోహణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు ఈ ప్రాంతం సహజ అందాన్ని, అక్కడ ఉన్న స్థానిక దేవాలయాల అందాన్ని చూసి సంతోషిస్తుంటారు.
కేవలం ఇవి మాత్రమే కాదు.. కిన్నౌర్ లో సందర్శించడానికి ఎన్నో అభివృద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, ట్రెక్కింగ్ ప్రాంతాలు, పార్కులు, ఇంకా చాలా వున్నాయి. ఇక్కడికి పర్యటించడానికి వచ్చే ప్రతిఒక్కరు సంతోషంగా తమ కాలాన్ని గడపవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more