జైనాథ్ ఆలయం... తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో వున్న దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టుపక్కల వున్న దర్శనీయ స్థలాల్లో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాథ్ గ్రామంలో వుంది. ఈ ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. చాలా పురాతనమైన ఆ ఆలయం దగ్గరున్న శిలాశాసనాలను, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ పవిత్ర దేవాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారని చరిత్ర చెబుతోంది.
పల్లవులు క్రీ.శ. 4 నుంచి 5వ శతాబ్దం వరకు అంటే దాదాపు 500 ఏళ్లు దక్షిణ భారతావనిని పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాదు గొప్ప కళానైపుణ్యం కలిగిన వారు కూడా! హస్త కళలలో, శిల్పకళలలోను వారు సిద్ధహస్తులు. రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళలో ప్రసిద్ధులు. వారి కాలంలో అనేక ఆలయాలు చెక్కబడి అందమైన శిల్పసౌందర్యంతో అలరారుతున్న అధ్భుతమైన కళాఖండాలు దేశంలో వున్నాయి. వాటిల్లో ఈ జైనాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో అలరారుతోంది కాబట్టి.. దీనికి ‘జైనాథ్’ అని పేరు వచ్చింది. ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది.
మరిన్ని విశేషాలు :
* ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు, మాసాలలోనూ దసరా అనంతరం వచ్చే ఆశ్వయుజ పౌర్ణమినాడు ఉదయం లక్ష్మీనారాయణుని పాదాలను ఉదయ కిరణాలు తాకుతుంటాయి. ఈ అధ్భుతదృశ్యం చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు.
* కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు, పూజలు, జాతరలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఆలయం భక్తుల రాకతో, యాత్రికులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది.
* సంతాన సాఫల్యత, కోరిన కోర్కలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. జైనధ్ ఆలయం పర్యాటక కేంద్రంగా మారి చరిత్రలో అద్భుతమైన ఆలయంగా మారుతుంది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more