హిందూ సంస్కృతీ - సంప్రదాయాలకు, వాటి ఆచారాలకు భారతదేశం పెట్టింది పేరు. మొత్తం ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అన్యమతాలవారు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అటువంటి భారతదేశంలో పూర్వం దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పురాణ స్థలాలు... దేవతలు తమ అంశాలతో స్వయంభువుగా కొలువై వున్న దేవాలయాలు... మరికొన్ని ప్రాచీన ఆలయాలు ఎన్నో దర్శనమిస్తాయి. కొన్ని హిందూ దేవాలయాలు ప్రాచీన కాలంలోనే శిథిలమైపోగా.. మరికొన్ని దేవాలయాలు రాజుల కాలాలనుంచి అభివృద్ధి చెందుతూ... మనకు దర్శనమిస్తున్నాయి.
అటువంటి పురాతన దేవాలయాల నుంచే పూర్వీకుల జీవన విధానం ఎలా వుండేది..? అన్న కోణంలో విశ్లేషించుకుని, దానికి తగినట్లుగానే వ్యవహరిస్తున్నారు ప్రస్తుత ప్రజలు. ఈ మహోన్నత దేవాలయాల నుంచే చాలామంది ప్రజలు తమ జీవన విధానంలో మార్పులు తెచ్చుకుని, భక్తి మార్గంలో అడుగులు వేస్తూ.. ఆధ్మాత్మికంగా జీవితాన్ని కొనసాగిస్తారు. చాలావరకు ఇటువంటి దేవాలయాలు మన భారతదేశంలోని నలుమూలలా వ్యాపించి వున్నాయి. కేవలం మన దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే హిందూ దేవాలయాలు వెలిసి వున్నాయి.
మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే హిందూ దేవాలయాలు ఎంతో ఆధ్మాత్మికతో కనువిందు చేస్తుంటాయి. ముఖ్యంగా చట్టర్పూర్ జిల్లాలోని ఖజురహో పట్టణంలో పూర్వీకుల జీవన విధానం ఉట్టిపడేలా ఎన్నో ఆలయాలు వున్నాయి. ప్రారంభంలో ఈ ప్రాంతంలో మొత్తం 85 వరకు దేవాలయాలు వుండేవి. రానురాను కాలక్రమంలో కొన్ని శిథిలమయిపోగా ఇప్పుడు కేవలం 22 మాత్రమే మిగిలాయి. అందులో హిందూ, జైన మతస్థులకు సంబంధించిన దేవాలయాలు చాలా వున్నాయి. అందులో ముఖ్యమైన కొన్ని దేవాలయాల గురించి మీకోసం....
1. లక్ష్మణ టెంపుల్... ఇది ఎంత ప్రాచీనమైన దేవాలయం. పూర్వం 930 - 950 మధ్యకాలంలో చండేలా అనే రాజు ద్వారా నిర్మించబడిందని ఇక్కడ శాసనాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం విష్ణుదేవుని పేరు మీదుగా నిర్మించబడింది. ఆలయ ప్రవేశంలోని ఒక భూసమాంతరమైన దూలంపై విష్ణు, బ్రహ్మ, శివ విగ్రహాలు దర్శనమిస్తాయి.
2. విశ్వనాథ్ టెంపుల్... ఈ ఆలయంలో మహాదేవుడు అయిన శివభగవానుడి విగ్రహం వుంటుంది. అలాగే శివుని వాహనం అయిన ఎద్దును కూడా ఇందులో నిర్మించారు. పూర్వం ప్రజల సంక్షేమాల కోసం శివుడు స్వయంభువుగా కొలువైవున్నాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.
3. వామన ఆలయం... శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారం అయిన వామనుని విగ్రహం ఈ ఆలయంలో ఎంతో ఆధ్మాత్మికంగా దర్శనమిస్తుంది. శ్రీ విష్ణువు మొట్టమొదటిసారిగా వామన రూపంలో మానవ బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తాడు. నిరాడంబరమైన శిల్పశైలితో నిర్మించిన ఈ దేవాలయం.. కొంచెం దూరంగా వేరే ప్రదేశంలో వుంటుంది. పూర్వం 1050 - 75 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.
4. వరాహ ఆలయం... శ్రీ మహాశిష్ణువు మూడవ అవతారం అయిన వరాహుని విగ్రహం ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైంది. పూర్వం 900 - 925 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
5. పార్శ్వనాథ ఆలయం... ఖజూరాహోలో వున్న ఆలయాలన్నింటిలో ఈ పార్శ్వనాథ ఆలయం ఎంతో పెద్దది. ఇందులో ఒక విశేషమైన ప్రత్యేకత కూడా వుంది. ఈ టెంపుల్ కు మూడు మిద్దెలు వుంటాయి. ఈ మిద్దెల నిర్మాణాలు హిందూ, ముస్లి, బౌద్ధ స్వభావాలను వెల్లువిరిసే శిల్పాలు చెక్కబడి వుంటాయి.
6. కందారియ మహాదేవ ఆలయం... భారతదేశంలో వుండే శిల్ప కళలన్నీ ఈ ఆలయంలో ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాయి. ఆలయానికి నలువైపులా వుండే అనేక శిల్పాలు చాలా అందంగా కనిపిస్తాయి.
7. దుల్హాదియో ఆలయం... ఈ ఆలయం నలువైపులా కూడా ఇంద్రలోకంలో వుండే నాట్యమణులు రంభ, ఊర్వశి, మేనక లాంటి అందమైన అప్సరసల శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ ఆలయంలో మహాదేవుని శివలింగం వుంటుంది.
8. చిత్రగుప్త టెంపుల్... యమలోకంలో అందరి పాపాచిట్టాలను నమోదు చేసుకునే చిత్రగుప్తుని ఆలయం ఎంతో అందంగా, ఆధ్యాత్మికంగా ఇక్కడ కొలువైవుంది. ఈ ఆలయం సూర్యభగవానుడికి అంకితంగా, తూర్పు ముఖంవైపు నిర్మించబడింది.
9. చతుర్భుజ ఆలయం... ఖజూరాహోలో వున్న శిల్పకళకు ఈ చతుర్భుజ టెంపుల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో కామ సౌందర్యాల శిల్పాలతోపాటు, 9 అడుగుల ఎత్తులో వున్న విష్ణువు విగ్రహం కూడా కొలువై వుంది.
10. ఆదినాధ్ జైన్ టెంపుల్... జైన మతస్థులవారికి ఈ ఆలయం ఎంతో ఆధ్యాత్మిక మైంది. దీనిని చూడడానికి దేశవిదేశాల నుంచి చాలామంది జైన మతస్థులతోపాటు హిందువులు కూడా వస్తుంటారు. దీని చుట్టూ శిల్పాలతో ఎంతో అందంగా నిర్మించబడింది.
ఇలా ఈ విధంగా రకరకాల దేవాలయాలు ఎంతో అద్భుతంగా వుంటూ, ప్రాచీన కాలంలో వుండేవారి జీవనశైలిని, వారి ఆచారాలను, సంస్కృతీ - సంప్రదాయాలను తెలుపుతూ.. విశేష ప్రత్యేకతలను వెదజల్లుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more