విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారిలో టంగుటూరి అంజయ్య ఎనిమిదవ వారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన.. కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్మిక నాయకునిగా, ఆ తర్వాత కేంద్ర కార్మిక మంత్రిగా ఎదిగారు. అనంతరం సీఎం స్థానాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రిగా ఈయన 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు పనిచేశారు
జీవిత విశేషాలు :
1919 ఆగష్టు 16వ తేదీన హైదరాబాద్ నగరంలో అంజయ్య జన్మించారు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది మెదక్ జిల్లాలోని భానూర్ గ్రామం. అయితే వృత్తిరీత్యా వారి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఆంజయ్య సుల్తాన్ బజార్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నారు. ఆర్థిక కారణాల వల్ల తన విద్యాభ్యాసాన్ని ఆపేసి.. హైదరాబాదు ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఈయన ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కష్టాలను సవాల్ చేస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించారు. ఆనాడు ఆయన పడిన కష్టమే ఆయన్ను కార్మిక నాయకునిగా ఎదిగేలా చేసింది. ఇక అక్కడి నుంచి ఆయన తన ప్రతిభతో, తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. కేంద్ర కార్మిక మంత్రి స్థాయికి చేరుకున్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు కూడా!
ముఖ్యమంత్రిగా :
1980లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో.. కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గం ఆయన్ను తొలగించి, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మిక శాఖామంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య.. వివిధ వర్గాలవారికి మంత్రివర్గంలో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన 61 మంది మంత్రులతో భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు. అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం కొన్ని మంచి కార్యక్రమాలను ఆనాడు చేపట్టారు. ముఖ్యమంత్రిగా కేవలం 16 నెలలపాటు కొనసాగినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించారు.
ఎదుర్కొన్న ఆరోపణలు :
ఈయన మంత్రివర్గంలో మంత్రుల సభ్యుల ఎక్కువగా వుండటంతో.. కొందరిని తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఆయన కొందరిని తొలగించాల్సి వచ్చింది. అయితే.. తొలగించినవారిని సంతృప్తి పరచడం కోసం ఎన్నో నిరూపయోగమై కార్పొరేషన్లు సృష్టించి.. వారికి పదవులిచ్చారు. అంతేకాదు.. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద భారీగా ఖర్చు చేశారు. దీంతో ఆయన ప్రభుత్వంలోనూ అసమ్మతి వర్గం పెరిగిపోయిందని.. ఆయన్ను అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది. ఆ తర్వాత 1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more