గానకోకిల లతా మంగేష్కర్ చేత "నిదురపోరా తమ్ముడా.." అంటూ ఎన్నటికీ మర్చిపోలేని గానాన్ని ఆలపింపింపచేసిన సుస్వరాల ఆరాధకుడు సుసర్ల దక్షిణామూర్తి ఫిబ్రవరి 9 న శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆయనని తెలుగు సరస్వతి ఎట్టకేలకు తన అక్కున చేర్చుకుంది. తెలుగు తమిళంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎఎమ్ రాజాలతో సంసారం చిత్రం కోసం గానం చేయించిన "సంసారం సంసారం", ఇలవేల్పులోని "చల్లని రాజా ఓ చందమామ", తాను స్వయంగా పాడిన "చల్లని పున్నమి వెన్నెలలోనే" కలకాలం గుర్తుండే గానాలు. నర్తన శాలలో "జననీ శివకామిని", "ఎవరికోసం ఈ మందహాసం", "సలలిత రాగ సుధారస సారం" పాటలు తెలుగు ఉన్నంతకాలం సజీవంగా ఉంటాయి.
1921 నవంబర్ 11 న కృష్ణాజిల్లా పెద్ద కళ్ళేపల్లి గ్రామంలో సంగీత సరస్వతీ నిలయమైన కుటుంబంలో జన్మించిన సుసర్ల దక్షిణామూర్తి, సంగీత విధ్యాంసుడు, సంగీతోపాధ్యయుడైన సుసర్ల కృష్ణబ్రహ్మ శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. తన పేరుని ప్రసాదించిన తాత సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి కర్ణాటక సంగీతంలో ఉద్దండులు.
సుసర్ల చిన్నతనంలో తాతగారి దగ్గర సంగీతం నేర్చుకోవటానికి దూరప్రాంతాల నుంచి వచ్చి ఇంటిలో ఉండే బీద పిల్లలతో నిండి ఉండేది. పుట్టిన దగ్గర్నుంచే సంగీత వాతావరణం ప్రభావం ఊరికే పోతుందా. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే సుసర్ల మచలీపట్నంలోని నవరాత్రి ఉత్సవాల్లో ఇతర గాయకులతో కూడి వయొలిన్ మీద సంగీత ప్రదర్శననిచ్చారు.
1938లో హిజ్ మాస్టర్స్ వాయిస్ (హెచ్ ఎమ్ వి) లో సుసర్ల హార్మోనియం వాయిద్యకారునిగా పనిచేసారు. ఆలిండియా రేడియోలో ఎ గ్రేడ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈయనను న్యూఢిల్లీ రేడియో స్టేషన్ లో దక్షిణ భారత సంగీత విభాగానికి డైరెక్టర్ పనిచేయటానికి ఆహ్వానించారు.
ఆ తర్వాత దక్షిణామూర్తి మద్రాసులో సినిమా రంగంలో సిఆర్ సుబ్బురామన్ దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరక్టర్ గా ప్రవేశించారు. 1946 నుంచి 1984 వరకూ 14 తెలుగు చిత్రాలతో అనుబంధమున్న సుసర్ల లైలా మజ్నూ, పరమానందయ్య శిష్యుల కథ, శ్రీ లక్ష్మమ్మ కథ, సర్వాధికారి, సంతానం, ఇలవేల్పు సినిమాల్లో సంగీత దర్శకత్వమే కాకుండా నేపధ్య గాయకుడికిగా కూడా పనిచేసారు.
సినిమా అనుబంధంతో ఎంతోమంది చేసినట్టుగానే సుసర్ల దక్షిణామూర్తి కూడా రెండు సినిమాలు తీసి చెయికాల్చుకున్నారు. అవి, 1960 లో తీసిన మోహినీ రుక్మాంగద, 1962లో నిర్మించిన రమా సుందరి చిత్రాలు. నర్తన శాలతో ఎన్టీఆర్ అభిమానానికి పాత్రులైన సుసర్ల ఆయన కోరిక మీద శ్రీమద్విరాట పర్వం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు.
చక్కెర వ్యాధి వలన 1972లో ఒక కన్ను చూపు పోగొట్టుకున్న సుసర్ల 1987 లో రెండవ కంటి చూపు కూడా పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 9 2012 న చెన్నైలో సంగీత ప్రియులందరినీ వదిలి అనంతలోకాలకు వెళ్ళిపోయారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంక్షిస్తూ, మధుర ఙాపకాలను, మధుర గానాలతోపాటు ఆయన ఇక్కడే వదిలి వెళ్ళిన కుటుంబ సభ్యలు, సంగీతాభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన ఎడబాటుని తట్టుకునే శక్తిని ప్రసాదించమని భగవంతుని కోరుతూ- తెలుగువిశేష్
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more