ఏపీ రాజకీయాల్లో బోండా వారి భూ కబ్జాల భాగోతం రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. స్వయంగా ముఖ్యమంత్రే బోండా భూకబ్జాల వ్యవహారంపై సమీక్ష నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి లావాదేవీలను బినామీల పేరు మీద నిర్వర్తిస్తుంటారు. కానీ, ఉమ మాత్రం తెలివి తక్కువగా భార్య పేరు మీద రిజిస్ట్రర్ చేయించి అడ్డంగా దొరికిపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు ఆదేశాలతోనే...
సాధారణంగా ఆయన మీద భూకబ్జా కేసు చాలా రోజుల కిందే నమోదు అయ్యింది. కానీ, హఠాత్తుగా సీఐడీ బోండా వర్గీయుల మీద కేసు నమోదు చేయటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే సాధారణంగా అధికారులు ఇలాంటి కేసుల్లో ముందుకు వెళ్తుంటారు. బోండా విషయానికొస్తే.. మంత్రి పదవి దక్కకపోవటంతో గత కొంత కాలంగా ఆయన అధిష్టానంపై అసంతృప్తి గళం వినిపిస్తున్నాడు. దీనికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ జరిపాడన్న వార్తలు చంద్రబాబు చెవిన పడ్డాయి. కృష్ణా, గుంటూరు బాధ్యతలను గనుక తనకు అప్పగిస్తే.. జనసేనలో చేరతానని పవన్ కు ఉమ వర్తమానం పంపాడన్న వార్త అప్పట్లో టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాలు నచ్చకనే చంద్రబాబు.. బోండా కేసుల్లో ముందుకు వెళ్లాలని సీఐడీకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చాడని.. ఆపైనే కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.
రాధా చేరిక కూడా అందుకేనా?
మరోవైపు వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే వార్త ఆ మధ్య వినిపించింది. టీడీపీకి ఇప్పుడు కాపు నేతల అవసరం ఉంది. అదే సమయంలో వారు చంద్రబాబు, లోకేష్ లకు వ్యతిరేకంగా గళం వినిపించకూడదు. అందుకే బోండా బదులు రాధాను వచ్చే ఎన్నికల్లో బెజవాడ బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారని అంతర్గతంగా పార్టీలో చర్చించుకుంటున్నారు.
మొత్తానికి బోండా కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు భూ కబ్జా భాగోతాన్ని తెలివిగా తెరపైకి తెచ్చాడని చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more