ఏపీ సీఎం చంద్రబాబు అన్ని తానై చూసుకోవాలనే తత్వంతో కీలక నేతలతో మనస్పర్థలను పెంచేస్తుంది. మొన్నటిదాకా కేవలం డిప్యూటీ సీఎం కేఈ తోనే సీఎం చంద్రబాబుకి పొసగలేదన్నది అందరికీ తెలిసిందే. రెవెన్యూ శాఖలో కోట్లాది ఆదాయం గోల్ మాల్ కావటంతో సంబంధిత పైళ్ల విషయంలో స్వయంగా బాబే అప్పుడు సంతకం చేశారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలోకి మరో మంత్రి వచ్చి చేరారు. ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారనే సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప హోం మంత్రిగానే కాదు మరో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఏపీలో కొనసాగుతున్న బదిలీల్లో భాగంగా డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) బదిలీల్లో చిన్నరాజప్ప వేలు పెట్టేందుకు అవకాశం లేకుండా సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రికి బదిలీలు చేసే హక్కులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. దీనివెనుక ఆయాశాఖల్లో అవినీతితోపాటు, వీరిద్దరి రాజకీయ జోక్యానికి కూడా చెల్లు చీటి ఇస్తుందని బాబు భావిస్తున్నారంట.
గతేడాది విశాఖ ఆర్డీఓ బదిలీ వ్యవహారం ముగ్గురు మంత్రుల మధ్య పెద్ద చిచ్చునే రేపింది. అంతేకాదు సంబంధిత మంత్రుల బంధువుల జోక్యం కూడా వీటిల్లో బాగానే జరుగుతోంది. దీంతో ఉద్యోగుల బదిలీల్లో మరిన్ని వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 15 మంది ఆర్డీఓలను, 22 మంది డీఎస్పీలను బదిలీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే రాను రాను ఇలా అందరి విషయంలో జోక్యం చేసుకునే పరిస్థితి నెలకొనటంతో మిగతా నేతలు ఈ విషయమై ఆయనను కూర్చోబెట్టి మాట్లాడాలని డిసైడ్ అయ్యారంట.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more