ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఈరోజు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రసంగించారు. కానీ రాష్ట్ర విభజన పై ఆయన చేసిన వ్యాఖ్యలు .. తెలంగాణ నేతల్లో ఆగ్రహం తెప్పించాయి. నిన్నటి వరకు తెలంగాణ నేతలపై , తెలంగాణ రాష్ట్రం పై అభిమానం , ప్రేమ ఉన్న గవర్నర్ నరసింహన్ ఒక్కసారిగా సీమాంద్ర గవర్నర్ గా ఎలా మారిపోయాడని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రజలు అంటే నాకు చాలా అభిమానం అని చెప్పిన గవర్నర్ ఇప్పుడు చంద్రబాబుతో కలిసి సీమాంద్ర రాష్ట్రం పై ప్రేమ కురిపిస్తున్నారు. దీంతో గవర్నర్ తెలంగాణ నేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. సోనియా ఇంటి బిడ్డగా ఉండి..రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం అందరికి తెలుసు. కానీ ఈరోజు చంద్రబాబు కు తొత్తుగా మారిపోవటం ఆశ్చర్యంగా ఉందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
రాష్ట్ర విభజన ఏర్పాటు వలన ఆయన మనసు గాయపడిందని, చాలా దారుణంగా తెలుగు ప్రజలను విడదీశారని గవర్నర్ చెప్పటం చూస్తే.. చంద్రబాబు కు అనుకూలంగా పనిచేస్తున్నడని విషయం అర్థమవుతుంది. సోనియాగాంధీకి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను రహస్యంగా నివేదిక అందించింది గవర్నరే కదా. మళ్లీ ఇలా సీమాంద్రకు సపోర్టు ఎలా మాట్లాడుతున్నాడని గులాబీ బాస్ తో.. గులాబీ నేతలు.. చర్చలు జరుపుతున్నారు.
గతంలో గవర్నర్ నరసింహన్ చేసిన పనులను గుర్తు చేసుకొన్న గులాబీ నేతలు తెలంగాణకు కొత్త గవర్నర్ కావాలని కేంద్రానికి లేఖ రాయటానికి సిద్దమవుతున్నట్లు రాజకీయ నేతలు అంటున్నారు. ఇప్పటికే బిజేపి సర్కార్ గవర్నర్లను రాజీనామా లపై ఒత్తిడి పెంచిన విషయం తెలిసిందే.
ఇదే అదునుగా భావించి .. నరసింహన్ ను మార్చి తే.. తెలంగాణ కు కొత్త ముఖ్యమంత్రి, కొత్త రాష్ట్రం , కొత్త గవర్నర్, కొత్త ప్రభుత్వం, కలిస్తే బంగారు తెలంగాణ అవుతుందని, మన ప్రజలు కు ఏం చేయాలో అన్ని సమకూర్చుకోవటానికి వీలుగా ఉంటుందని .. తెలంగాణ సిఎం కేసిఆర్ తో పార్టీలోని సీనియర్లు సూచించినట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ గవర్నర్ ను మార్చే దిశగా అడుగులు వేస్తే.. గవర్నర్ నరసింహన్ మారిపోవటం ఖాయమని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more