పది సంవత్సరాలు రాజకీయల్లో ఆ పార్టీ జెండా కొద్ది సేపు, ఈ పార్టీ జెండా కొద్ది సేపు ..మోసి చివరకు జగన్ జెండా తో గెలిచిన సినిమా నటి, ఎమ్మెల్యే రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై భారీ భారం పెట్టింది. అంటే మరోలా అనుకోకండి? ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కోసం.. రోజా ఓపెన్ డోర్ తెరిచింది. మా పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న సీమాంద్ర బాధ్యత మొత్తం పవన్ కళ్యాణ్ దే అని చిలక పలుకులు పలుకుతుంది. అసలు విషయం ఏమిటంటే.. ఆంద్రప్రదేశ్ లో అధికారం వస్తుందని ఆడ, మగ తేడా లేకుండా ఆ పార్టీలోని నేతలు అందరు పగటి కలలు కన్నారు. కానీ ఆ పగటి కలలు నిజం కావని ..ఎన్నికల తరువాత వైసీపీ నేతలకు తెలిసింది. దీంతో వారు ప్రతిపక్షనేతలుగా మిగిలిపోయారు.
అయితే ఇప్పుడు జగన్ పార్టీ నుండి గెలిచిన రోజా, జనం సమస్యలను పవన్ కళ్యాణ్ పై రుద్దుతుంది. ప్రజా ఓట్లతో గెలిచిన రోజా, ప్రజా సమస్యలకు మాత్రం చాలా దూరంగా ఉంటుంది. అంటే దీనిని బట్టి రోజా పువ్వు కింద ముల్లు ఉన్నట్లే, ఈ ఎమ్మెల్యే రోజా కింద ..ప్రజా ముల్లు(సమస్యలు) లేదనే విషయం గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు అర్థమైంది.
ఈరోజు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న రోజమ్మ, పవన్ కళ్యాణ్ ను తలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ధీమాగా ఉన్న వైకాపా పార్టీని ఓటర్లు ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సహా పలువురు ఎంఎల్ఏలు జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు గాను మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
అందులో ఒకరు సినీనటి రోజా. ఈ సందర్బంగా రోజా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ప్రజల సమస్యల కోసం పోరాడుతామని అన్నారు. అయితే రైతు రుణమాఫీ విషయం గురించి రోజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరుపున ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను చూసి ప్రజలు ఓట్లు వేసారని. ఇప్పుడు రైతు రుణమాఫి జరుగకపోతే దానికి పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలని రోజా అన్నారు.
రోజా మాట్లాడిన తీరును బట్టి చూస్తే.. జగన్ వల్ల ఏమీ కాదు. అంత పవన్ కళ్యాణ్ నే చూసుకొనే విధంగా రోజా మాట్లాడిందని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రజలు మనకు ఓట్లు వేసి గెలిపిస్తే , . పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యలా? ఏం.. రోజా ఇలా మాట్లాడుతున్నావని ఆ పార్టీలోని సినియర్ నాయకులు..ఆమె పై కొన్ని గులాబీ ముల్లు విసిరారు. దీంతో ఖంగుతిన్న రోజా వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇలాంటి నాయకులతో మా పార్టీ పరువు పోతుందని పార్టీలోని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నారు.
అసెంబ్లీలో అడుగు పెట్టే ముందు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరును మీడియా ముందు తలచుకుని సీమాంద్ర ప్రజల్లో పవన్ రేంజ్ ఇంకా పెంచినట్లు గా ఉందని ఆ పార్టీ కార్యకర్తలు రోజా పై మండిపడుతున్నారు. దీంతో జగన్ ఎంటరై.. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మీడియా ముందు మాట్లాడండని రోజా కు క్లాస్ పీకీనట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more