దుద్దిళ్ల శ్రీధర్ బాబు మూడు సార్లు మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కీలక మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ఈసారి తెలంగాణలో శ్రీదర్ బాబు రాజకీయ పరిస్థితి చివరి పరిస్థిత్తుల్లో ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు.
మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబుకు ఆశించినంత మేర ప్రజల్లో సానుకూల ప్రభావం ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ సర్వేలు చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ గ్రామాల్లో సానుకూలత కనిపించడం లేదని ఆపార్టీ కార్యకర్తలే అంటున్నారు.
శ్రీధర్ బాబు మంత్రిగా సమయంలో ప్రజలకు చేరాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే చేరటంతో పల్లెల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సమీపంలోనే గోదావరి వున్నా, తాగునీటి సమస్య పరిష్కారంలో విఫలమయ్యారని శ్రీధర్ బాబుపై విమర్శలున్నాయి.
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం సాగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ద్వారా ప్రతిపక్షాల నోటిని పోలీసులతో మూసేయించారనే విమర్శ శ్రీధర్ బాబుపై వుంది. మరో వైపు పెద్దపల్లి ఎంపి వివేక్ కు, శ్రీధర్ బాబుకు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. తెరాసలో వివేక్ కీలక పాత్ర పోషించడంతో ఈసారి మంథనిలో శ్రీధర్ బాబును ఎలాగైనా ఓడించాలని వివేక్ పట్టుదలతో ఉన్నట్లు ఆ పార్టీ నియోజక వర్గ ప్రజలు అంటున్నారు.
అయితే ఈసారి శ్రీదర్ బాబు తెలివిగా మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పెత్తనం మంథనిలో ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. మంథనిలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో, ప్రతిపక్షంలో తన అనుచరులను చేర్చి, ప్రత్యర్థి వ్యూహాలను ఎప్పటికప్పుడు శ్రీధర్ బాబు తెలుసుకుంటూ వుంటారని పేరు ఆ నియోజక వర్గ ప్రజల్లో బలంగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే శ్రీదర్ బాబుకు గిట్టనివాళ్లపై వెంటనే పోలీసులకు ఫిర్యాదులు వెళుతుంటాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుంటారు. ఇలాంటి సమయంలో శ్రీధర్ బాబు ఈసారి మంథనినుంచి పోటీ చేయకపోవచ్చునని అంటున్నారు.
తన తమ్ముడు శ్రీనుబాబును మంథని నుంచి పోటీకి దింపి, తాను రామగుండం నుంచి పోటీ చేసే ఆలోచనలో వున్నారని తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు అంటున్నారు. ఏమైన ఈసారి శ్రీదర్ బాబుకు ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more