రాజ్యసభ ఎన్నికల తరువాత.. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుసగుసలాడుతున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులతో పాటు.. మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ మారింది. అయితే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అధిష్టానం వేటు వేసే వరకు ఎదురుచూడకుండానే.. రాజీనామాకు సై అంటున్నట్లు.. కాంగ్రెస్ నాయకుల మద్య పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం .. తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనలో భాగం కాదల్చుకోలేక ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం జూబ్లీ హాల్ లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో సీఎం కిరణ్ భేటీ అయి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాజీనామా అంశాన్ని సీఎం కిరన్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సీమాంద్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం వెనుకు ముఖ్య ఉద్దేశం ఏమిటనేది ఎవరికి అర్థం కావటంలేదని.. కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. తనపై వేటు వేసే అవకాశం ఎవరికీ ఇవ్వనని సీఎం కిరణ్ వారితో పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఈరోజ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా అంశాన్ని ప్రకటిస్తారని సీమాంధ్ర నేతలు అంటున్నారు.
అసెంబ్లీ వేదికగా సమైక్యగళాన్ని వినిపించిన కిరణ్ తిరస్కరణ నోటీసుతో బ్రహ్మస్త్రాన్ని సంధించారు. ఇదంతా రాష్ట్రానికే పరిమితం కావడంతో అధిష్టానం ఒక్కమాట మాట్లాడలేదని సమాచారం. ఇన్నాళ్లు ప్రెస్మీట్లు.. మీటింగ్లకే పరిమితమైన సీఎం కిరణ్ దూకుడు మరింత పెంచారు. మౌనదీక్ష పేరుతో ఏకంగా ఢిల్లీని ఢీ కొట్టేందుకు సిద్దపడిన విషయం తెలిసిందే. అయితే దేశరాజధాని సాక్షిగా హస్తిన వీధుల్లో సమైక్యస్వరాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని విభజించకూడదంటూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి విన్నపించారు. సమైక్యం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ వ్యాఖ్యలు చేశారు. కిరణ్ వ్యవహారాన్ని పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు సీఎంపై దృష్టిసారించిందని, ఢిల్లీలో దీక్ష చేయడం హైకమాండ్కు మింగుడుపడడం లేదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇదిలా ఉంటే ఢిల్లీ నాయకత్వమే సీఎం కిరణ్ ను ప్రోత్సాహిస్తోందని బిజెపి నాయకులు గోల చేస్తున్నారు. దీనికి తోడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వత్తిడి తెస్తున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. దీంతో విసిగిపోయిన అధిష్టానం నల్లారి పై వేటు వేయటానికి సిద్దమైన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకే షాకిచ్చేందుకు రెఢీ అవుతున్నట్లు సీమాంద్ర కాంగ్రెస్ నేతలు .. గుసగుసలాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేస్తుందా?' లేక... 'మీరు తప్పించేదేంటి! నేనే తప్పుకొంటా?' అంటూ పార్టీకి కిరణ్ మరో షాక్ ఇస్తారా? వీటిల్లో ఏది ముందు జరుగుతుందో వేచి చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more