చైనీస్ రెస్టారెంట్ కి, ఇటాలియన్ పిజ్జాకి, ఇరానీ టీకి, ఢిల్లీ స్వీట్స్ కి, రాజస్తానీ ఢోక్లాకీ ఢోకా లేదు బాగానే అమ్ముడుపోతాయి కానీ, ఆంధ్రా పేరుతో వడ్డిస్తే ఇష్టమైన కోడికూరతో కూడా ముద్ద దిగదంటున్నారు తెలంగాణా ప్రాంతాభిమానులు
ఊరు మారినా మనిషి మారునా అంటారు, అతని పేరు కూడా మారదని అంటారు. కానీ వీరాభిమానంతో, తినే పదార్థం అదే అయినా దాని పేరుని మార్చి వేస్తేనే దాన్ని తిన్న తృప్తి ఉంటుందంటున్నారు తెలంగాణా వాదంలో.
తెలంగాణాలో చాలాచోట్ల ఆంధ్ర భోజన శాలలు అన్న బోర్డులో ఆంధ్రా పేరుని తీసివెయ్యటం జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్ కి ఎదురుగా ఆంధ్ర రెస్టారెంట్ ని పది సంవత్సరాల నుంచి నడిపినవాళ్ళు ఇప్పుడు దాన్ని తెలంగాణా రుచులు గా మార్చివేసారు. హైద్రాబాద్ లో అన్ని రకాల వంటకాలున్నాయి. ఆంధ్ర కోడి కూర, ఇరానీ, ముఘలాయ్, రాయలసీమ రుచులు ఉన్నాయి కానీ తెలంగాణా పేరు మీద లేకపోవటంతో ఆ లోపాన్ని పూరిద్దామనుకున్నారు ఈ విధంగా.
ఆంధ్రా అంటే ద్వేషమేమీ లేదు కానీ మా తెలంగాణా పేరు లేకపోవటమేమిటంటున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలంగాణా వాద విద్యార్థులు. అందుకే చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థలు కూడా తెలంగాణా పేరుని ముందు చేర్చి ప్రకటనలు చేస్తున్నారు. ఆంధ్రా పేరుతోనే మండిపడుతున్న తెలంగాణా వాదులు తమ వాహనాల మీద ఎపి ఉన్నచోట టిజి అని రాసుకోవటం చేసారు. తెలంగాణాలో ఆంధ్రా బ్యాంక్ లో లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయి.
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన అనేక రాజకీయ కార్టూన్లలో ఒకటి, మహిళా కేంద్రం ఉద్ఘాటనకు వెళ్ళిన రామారావు 'కేంద్రం' పదాన్ని చూసి అసహనం చూపిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా పనిచెయ్యగూడదని చెప్తూ, 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదంతో వచ్చిన ఎన్టీఆర్ ఎప్పుడూ కేంద్రాన్ని దుయ్యబట్టే ఎన్టీఆర్ 'కేంద్రం' పేరుతో మండిపడుతున్నట్టుగా వేసిన కార్టూన్ అది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more