సీబీఐ అధికారులకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇటీవల దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ను గురువారం కోర్టు తిరస్కరించింది. ఈనెల 3న ఈ కేసుకు సంబంధించి మొదటి చార్జిషీటుకు అనుబంధ చార్జి షీటును సీబీఐ కోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో పలు కంపెనీలను సీబీఐ నిందితులుగా పేర్కొనడం జరిగింది.అయితే చార్జిషీటు పరిశీలించిన కోర్టు కేవలం కంపెనీలనే నిందితులుగా పేర్కొన్నారే తప్ప ప్రతినిధుల పేర్లు చేర్చలేదంటూ చార్జిషీటును తిప్పిపంపింది. ఇందులో పొందుపరిచిన అంశాలు సవివరంగా లేవని, పూర్తి వివరాలతో మరోసారి చార్జిషీటును దాఖలు చేయాలని కోర్టు సీబీఐ అధికారులను అదేశించింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లోనూ దాఖలు చేసిన చార్జిషీటుల్లో వివరాలు సరిగా లేవని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more