అమెరికాలో తెలుగువారి ఖ్యాతి మరింత ఇనుమడించనుంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో మహాత్మాగాంధీ ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పి అక్కల శ్రీరామ్ ఈ విగ్రహాన్ని మైనం,ఫైబర్తో రూపొందించారు. ఈ విగ్రహాన్ని గురువారం తెనాలి నుంచి అమెరికాకు పంపారు. వచ్చే నెల మొదటి వారంలో అమెరికాలో జరగనున్న ఆటా సమావేశాల్లో మహాత్ముని ప్రతిమను తెలుగువారికి చూపించి అనంతరం ఇండియన్ అంబాసిడర్ నిరుపమారావు ద్వారా వైట్హౌస్ కు అందజేయనున్నట్లు శ్రీరామ్ వివరించారు. ఇటీవల మైనం, ఫైబర్తో సజీవ ఆకృతిలో రూపొందిం చిన విగ్రహాలను శ్రీరామ్ అమెరికాలోని పలు నగరాల్లో ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఇండియన్ అంబాసిడర్ నిరుపమారావును శ్రీరామ్ కలిసిన సందర్భంలో వైట్హౌస్లో ఏర్పాటు చేసేందుకు మహాత్మాగాంధీ విగ్రహాన్ని రూపొందించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more