ధరల పెంపు తప్పనిసరని, అయితే ధరలు పెంచడానికి ముందు అన్ని రాజకీయ పార్టీలతోను చర్చించాల్సి ఉందని తుర్క్మనిస్థాన్- అఫ్గానిస్థాన్- పాకిస్తాన్- భారత్ పైప్లైన్ ఒప్పందంపై సంతకాలు చేయడానికి అస్గాబాత్ వెళ్తూ కొద్దిసేపు ఇక్కడ ఆగినప్పుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను 2010 జూన్లోనే ఎత్తివేసిన విషయం తెలిసిందే. డాలరుతో రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి పడిపోయిన దృష్ట్యా చమురు దిగుమతుల బిల్లు భారం పెరిగిపోనుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ధరల పెంపు ఎప్పుడు జరగనుందో మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. అయితే గత ఏడాది నవంబర్ 4న చివరగా పెట్రోలు ధరలను పెంచారు.
అప్పటినుంచి ఇప్పటిదాకా చమురు ధరలు 14 శాతం పెరిగినప్పటికీ, డాలరుతో రూపాయి విలువ 7 శాతం తగ్గినప్పటికీ పెట్రోలు ధరలను పెంచలేదు. కాగా, డీజిలు, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను గత ఏడాది జూన్లో పెంచిన విషయం తెలిసిందే. ‘అమెరికా డాలరుతో రూపాయి ఒక రూపాయి మేర తగ్గితే చమురు కంపెనీలు ఏటా 8వేల కోట్ల రూపాయలు నష్టపోతాయి. రూపాయి సోమవారం 55 రూపాయల ఆల్టైమ్ కనిష్టస్థాయికి పడిపోయింది. అంటే ఈలెక్కన రూపాయి విలువ తగ్గిన కారణంగా చమురు కంపెనీలు ఈ ఏడాది 72 వేల కోట్ల రూపాయలు నష్టపోనున్నాయి’ అని జైపాల్ రెడ్డి అన్నారు. ‘ఇదంతా చూసిన తర్వాత ఏదోఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎలా చేస్తారు, ఎప్పటిలోగా చేస్తారనేది నేను ముందుగా ఊహించి చెప్పలేను’ అని జైపాల్ అన్నారు. అంతేకాదు పెట్రోలు ధరలు పెంచాలని కానీ, లేదా పెంచకూడదని కానీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more