దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే కేసుల వ్యాప్తి విపరీతంగా ఉంది. అయితే ఇందుకు కరోనా ప్రధాన వేరియంట్ ఒమిక్రాన్ లో కొత్త సబ్ వేరియంట్ కారణమని తేలింది. దీనిని ఒమిక్రాన్ బీఏ 2.75 వేరియంట్ గా పిలుస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. అధికారులు పెద్ద సంఖ్యలో శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించి పరిశీలించారు.
ఈక్రమంలో చాలా శాంపిళ్లలో కొత్త ఉప వేరియంట్ ఉన్నట్టుగా బయటపడిందని ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2.75 వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్టు నివేదికల్లో వెల్లడైంది. ఇది మిగతా వేరియంట్లతో పోల్చితే మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ఇటీవల 90 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా.. కొత్త వేరియంట్ విషయం బయటపడింది. ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకుని శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడిన వారికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకుతోందని తేలింది” అని డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.
ఈ కొత్త వేరియంట్ శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని మరీ సోకుతోందని, వేగంగా ఇతరులకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు మరీ ప్రమాదకరంగా ఏమీ ఉండటం లేదని తెలిపారు. కానీ 60 ఏళ్లు దాటినవారు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులో 2,445 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 15.41గా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more