Internet celeb, actress Gayathri dies in road accident గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కారులోని మహిళ.. నటి గాయత్రే..

Who was dolly gayatri and what was her death reason youtuber car accident

Gayatri, Dolly, Dolly Gayatri, youtuber Gayatri, Youtuber dolly, Tollywood actress Gayatri, Gayatri died in Road Accident, Gayatri and Rahul in Road mishap, Gayatri, Dolly, youtube, actress, Gachibowli, Car accident, prism pub, Ella Hotel, gardener Maheswaramma, cyberabad police, Telangana, crime

Gayatri passed away in a tragic accident and the news of her death due to the accident is making headlines all over the country. The actress was such an amazing personality and she had been working great in her career. She was basically from Hyderabad, Telangana India.

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మరణించిన నటి గాయత్రే.. ఎవరు.?

Posted: 03/19/2022 03:41 PM IST
Who was dolly gayatri and what was her death reason youtuber car accident

యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ డాలీ అలియాస్ గాయత్రి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం నుంచి మీడియాలో అమె గురిచే వార్తలు.. అమె మరణానికి గల కారణాలపైనే విశ్లేషణలు. అమె కారు ఎల్లా హోటల్ నుంచి బయలుదేరినప్పటి నుంచి అసలేం జరిగింది. ప్రమాదం ఎలా సంభవించింది. అందుకు కారును నడిపిన అమె స్నేహితుడు రోహిత్ దే కారణమా.? ఆయన మద్యం సేవించడమే ప్రమాదానికి ఆజ్యం పోసిందా.? మద్యానికి తోడు అతివేగంగా కారును నడిపించడమే గాయత్రి ప్రాణం తీసిందా.? అసలు ఎవరీ గాయత్రి.?

తెలంగాణకు చెందిన యువతి గాయత్రి. అమెను అభిమానులు డాలీ అని ముద్దుగా పిలుచుకోవడంతో అమె తన స్ర్కీన్ పేరును కూడా డాలీగానే మార్చుకుంది. అభిమానులకు అమె ఇచ్చే ప్రాధాన్యత అది. అయితే 23 ఏళ్ల గాయత్రి మల్టీ టాలెంటెండ్ పర్సన్. వృత్తి రిత్యా సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఈ యువతి.. మరోవైపు తన నటనను తన ప్రవృత్తిగా మార్చుకుంది. ఈ క్రమంలో అమె పలు ఓటిటి సిరీస్ లతో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేసింది. అయితే అభిమానులను సోంతం చేసుకునేందుకు అమె సోషల్ మీడియాను ఎక్కువ ఫోకస్ చేస్తూ.. అక్కడే అధికమంది ఫ్యాన్స్ ను సోంతం చేసుకుంది.

శుక్రవారం రోజున హోలీ పండుగను పురస్కరించుకుని రాత్రి రోహిత్ అనే వ్యక్తితో కలిసి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు చేరకున్న అమె అక్కడ పబ్ లో అందరితో సరదాగా ఎంజాయ్ చేసింది. రాత్రి సమయంలో ఇంటికి తిరుగుపయనం అవుతున్న సమయంలో అమె ఎక్కిన కారు వేగంగా వెళ్లి అదుపు తప్పి ఫుట్ ఫాత్ పై దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన గార్డెనింగ్ వర్క్ చేస్తున్న మహిళ మహేశ్వరమ్మపైకి కారు దూసుకుపోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు మహిళతె పాటు గాయత్రి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మరోవైపు ఈ ప్రమాదంలో కారును వేగంగా నడిపిన రోహిత్ తీవ్రగాయాలయ్యాయి. అయన పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత కొంత కాలంగా గాయత్రి, రోహిత్ సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి రోహిత్ పికప్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రిజం పబ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles