పాపులారిటీ కోసం పాకులాడుతున్న రోజులివి. దీంతో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాను కూడా అందుకు వారధిగా మార్చుకుంటున్న యువత ఎందరో. అయితే అందరి భిన్నంగా వీడియోలు చేసి త్వరగా పాపులర్ కావాలనే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువ. ఇందుకు ఎలాంటి వేదికలైనా వీరి వారి వీడియోల కోసం వినియోగించుకుంటారు. పెళ్లిళ్లు, రోడ్డుపై, ఫంక్షన్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ నృత్యం చేసే, పాటలు పాడే వీడియోలతో నింపేస్తారు. ఇలా అలోచించి ఓ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్టు చేసిన ఇన్ ఫ్లూయన్సర్ కు పోలీసులు తాఖీదులు అందజేశారు.
అదేంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు నోటీసులు అందించి.. సమాధానంతో సంతృప్తి చెందని పక్షంలో అదుపులోకి తీసుకుంటారా.? కోర్టులోహాజరుపరుస్తారా.? అసలేంటీ అంత తప్పు అంటారా..? అందరినీ కాదండీ కానీ.. చట్టాన్ని అతిక్రమించినవాళ్లకు మాత్రం ఈ తరహా చర్యలు తప్పువని పోలీసులు సంకేతాలను వెలువరించారు. ఎందుకనో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రద్దీగా ఉండే కూడలిలో ఒక మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం పోస్టు చేసిన ఈ వీడియో ఏకంగా వేలాది మంది పంచుకున్నారు.
ఆ వీడియో తెగ వైరల్ గా మారడంతో పోలీసులు ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. శ్రేయా కర్లా అనే మహిళ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలోని రసోమా స్క్వేర్ వద్దనున్న జీబ్రా క్రాసింగ్పై రెడ్ లైట్ పడగానే వచ్చి డ్యాన్స్ చేసింది. బ్లాక్ డ్రెస్సు వేసుకున్న ఆమె.. డోజా క్యాట్ సాంగ్కు స్టెప్పులేసింది. ఆ రూట్లో వెళ్తున్న వాహనదారులు.. రోడ్డుపై ఆమె డ్యాన్స్ చూసి అవాక్కు అయ్యారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం ఆ మహిళపై చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో ఆమెకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more