ఆఫ్ఘనిస్తాన్ ను తమ కబంధహస్తాలలోకి తీసుకున్న తాలిబన్లు.. అక్కడి ప్రజల్లో మాత్రం పాలకులుగా ముద్రవేసుకోలేకపోతున్నారు. తాలిబన్ల పాలనలో తాము ఉండలేమని అప్ఘన్ ప్రజలు తమ ఆస్తిపాస్తులను వదిలి విదేశాలకు పారిపోతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్న లక్షలాది మంది అప్ఠన్ ప్రజలకు తాము ఉన్నామన్న భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైన తాలిబన్లు.. వారిపై భయాందోళనకు గురిచేసేలా తుపాకీ గుళ్లతో దాడులు చేస్తున్నారు. అయినా వాటిని తప్పించుకుని విమానాశ్రయానికి చేరుతున్న ప్రజలపై ఐసిస్ ఉగ్రవాదులు పగబట్టారు. ఆత్మాహుతి దాడులకు, పేలుళ్లకు పాల్పడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నో ఆత్మాహుతి దాడులను చూసింది. 20 ఏళ్ల కిందట తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకూ ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి. కానీ గురువారం జరిగిన ఆత్మాహుతి దాడి మాత్రం పెను విషాదాన్ని మిగిల్చింది. తాలిబన్ల బారి నుంచి తప్పించుకొని ఇల్లూవాకిలి వదిలి వేరే దేశాలకు వెళ్లిపోవడానికి ఎదురు చూస్తున్న వాళ్లు లక్ష్యంగా ఈ దాడి జరగడం మహా విషాదం. అమెరికా మిలిటరీ కూడా గత పదేళ్లలో ఎన్నడూ చూడని ఉగ్రదాడి ఇది. ఈ దాడిలో ఏకంగా 13 మంది అమెరికా సైన్యంతో పాటు అనేకమంది అప్ఘన్లు, తాలిబన్లు కూడా హతమయ్యారు. మృతుల సంఖ్య ఏకంగా 103కు చేరగా, క్షతగాత్రుల సంఖ్య కూడా 143కు చేరింది.
అయితే ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ అప్ఘన్ జాతీయుడు అదామ్ ఖాన్.. ఆ భయానక దృశ్యాల గురించి వివరించారు. ఆ వ్యక్తి అమెరికా ప్రత్యేక ఇమ్మిగ్రెంట్ వీసా కలిగి ఉన్న అధికారి. గతంలో ఓ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ గ్రూప్లో పని చేశారు. ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వేల మందిలాగే ఆ వ్యక్తి కూడా కాబూల్ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయమే కాబూల్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వేల మంది ఉన్న వరుసలో నిల్చున్నారు. పది గంటల పాటు అలా వేచి చూసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో ఈ భారీ పేలుళ్లు జరిగాయి.
ఆ పేలుడు తర్వాత నా కాళ్ల కింద భూమిని ఎవరో లాగేసినట్లు అనిపించింది. నా కర్ణభేరి పగిలిపోయిందా అనుకున్నాను. కొంతసేపు ఏమీ వినిపించలేదు. శరీర భాగాలు టోర్నడోలో చిత్తు కాగితాలలాగే గాల్లోకి ఎగిరాయి. మృతదేహాలు, శరీర భాగాలు, తీవ్రంగా గాయపడి సాయం కోసం వేడుకుంటున్న మహిళలు, పిల్లలు, వృద్ధులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. నా జీవితంలో యుగాంతాన్ని చూస్తానో లేదో కానీ.. ఇవాళ అలాంటిదే చూశాను అని ఆ వ్యక్తి జరిగిన దారుణాన్ని వివరించారు.
గత ఆఫ్ఘన్ ప్రభుత్వంలో హయాంలో ఉన్న వ్యక్తి కావడంతో తాలిబన్లకు భయపడిన తన పేరు చెప్పడానికి నిరాకరించారు. పేలుడు తర్వాత మృతదేహాలను అక్కడి నుంచి తరలించడానికి, గాయపడిన వారిని హాస్పిటల్స్కు తీసుకెళ్లడానికి ఎవరూ లేరు. అలా రోడ్డుపైన, పక్కనే ఉన్న మురికి కాలువలో పడి ఉన్నారు. ఆ కాలువలో నీళ్లకు బదులు రక్తం పారుతోందా అనిపించింది. శారీరకంగా నేను బాగానే ఉన్నాను. కానీ ఈ పేలుడు చూసిన తర్వాత మానసికంగా నా జీవితం బాగుంటుందా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు అని ఆ ప్రత్యక్ష సాక్షి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more