రైలు బండి నిలబడినప్పుడే ఎక్కాలని ఓ వైపు రైల్వే అధికారులు ప్రతీ స్టేషన్లో పెద్ద పెద్ద మైకుల్లో చెబుతున్నా.. రైలు మరికొద్ది నిమిషాలలో కదులుతుంది అన్నప్పపుడు మాత్రమే రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడటం సర్వసాధారణం. అయితే ఇలానే చేసిన ఓ మహిళా ప్రయాణికురాలికి తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించిన అమె రైలును ఎక్కే చివరి క్షణంలో కిందపడిపోయింది. అయితే అక్కడే వున్న సహ ప్రయాణికులు అమెను చూసి వెనువెంటనే అప్రమత్తతతో వ్యవహరించడంతో అమె బయటపడింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోని రైల్వేస్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త.. పిలల్లతో ఇండర్ రైల్వే స్టేషన్ లోకి వచ్చిన మహిళా ప్రయాణికురాలు.. రైలు ఎక్కేందుక వచ్చారు. అయితే అమె భర్త లగేజీతో పాటు పిల్లలను తీసుకుని రైలు ఎక్కాడు. ఇంతలో రైలు కదిలింది. దీంతో అ మహిళ కూడా కదులుతున్న రైలు ఎక్కబోయింది. అయితే అప్పటికే వేగాన్ని అందుకోవడంతో మహిళ జారీ కిందపడింది. అమె పడటాన్ని అక్కడే వున్న తండ్రీ కూతుళ్లు గమనించారు. వెంటనే అప్రమత్తతతో వ్యవహరించి.. మహిళా ప్రయాణికురాలని ఆర్పీఎప్ సిబ్బంది తరహాలోనే వెనక్కి లాగారు. ఈ ఘటనతో అక్కడే వున్న రైల్వే పోలీసులతో పాటు సహప్రయాణికులు కూడా పరుగుపరుగున వచ్చారు.
సహ ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మహిళా ప్రయాణికురాలు స్వల్పగాయాలతో బయటపడింది. ఈలోగా రైలులోపల వున్న ప్రయాణికులు కూడా అమెను గమనించి వెంటనే చైన్ లాగారు. దీంతో రైలు కూడా నిలిచిపోయింది. మంగళవారం జరిగి ఈ సంఘటనపై రైల్వే పీఆర్వో ఖేమ్ రాజ్ మీనా స్పందించారు. మహిళా ప్రయాణికురాలు సురక్షితంగా వుందని అన్నారు. సహ-ప్రయాణీకుల అలర్ట్ గా ఉండటం కారణంగా మహిళ ప్రాణాలతో బయటపడిందని.. కదులుతున్న రైలు ఎక్కడం ప్రమాదకరమని ఈ తరహా చర్యలకు ప్రయాణికులు చేపట్టరాదని ఆయన చెప్పారు.
#MadhyaPradesh: Fellow passengers saved the life of a woman in Indore who was trying to board a moving train, yesterday.
— NDTV (@ndtv) August 19, 2021
(Video: Railway Protection Force, Indore/ANI) pic.twitter.com/AO0cp5wOto
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more