టాలీవుడ్ సినీ నిర్మాత సి.కల్యాణ్ అటు నిర్మాతగా కోనసాగుతూనే ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ బిజీగా మారారు. అయితే ఆయనకు ఇప్పుడు టైం కలసివస్తున్నట్లు లేదు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఆయనపై భూ వివాదానికి సంబంధించిన కేసు నమోదుకాగా, ఇక వెనువెంటనే అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి కూడా శ్రీముఖాలను అందుకోవాల్సి వచ్చింది. షేక్ పేట్ పరిధిలోని తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, తనను బెదిరిస్తున్నారంటూ ఫిలింనగర్ కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయగా, షరూఫ్, తేజస్వి, శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులతో పాటు నిర్మాత సి.కల్యాణ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో కేసులో ఆయనతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన రూలింగ్ సహేతుకంగా లేదని, ఫైనల్ డిక్రీ కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి వెళితే, హైదరాబాదు శివారు హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 80లో కొంత భూమి తనదని సి.కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ హమీదున్నీసా బేగం, సెహెబ్బాదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం నాడు ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ పొందకుండా కట్టడాలు ఎలా కడతారని ప్రశ్నించింది. కల్యాణ్ తరఫున న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, ఫైనల్ డిక్రీ వచ్చిందని చెప్పారు. దీనిపై అసహనాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో స్పందించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more