ప్రపంచవ్యాప్తంగా పలు బహుళజాతి సంస్థలతో పాటు కార్పోరేట్ సంస్థలు తమ ఉద్యోగులను పనిదినాల్లో తీవ్ర ఒత్తిడికి గురిచేసినా.. ఆ ఒత్తిడి నుంచి సేద తీరడానికి కేవలం వారానికి ఐదు రోజులే పనిదినాలుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే జర్మనీకి చెందిన ఉద్యోగులకు అక్కడి సంస్థలు సరికొత్త వెసలుబాటు తీసుకురాగా, అక్కడి ప్రభుత్వం కూడా అందుకు సమ్మతించింది. ఇక్కడ వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు. అయితే ఇక్క ఉద్యోగులు మాత్రం పనిదినాల్లో 8 గంటలకు బదులుగా పది గంటలు పనిచేయాల్సి వుంటుంది. దీంతో వారానికి మూడు రోజులు వీరికి సెలువులు లభిస్తాయి.
అందుకు అనుగూణంగా జర్మనీ ప్రభుత్వం ఉద్యోగ విధుల పనిగంటలు.. విరామ దినాల విషయంలో మార్పులు చేసింది. అయితే ఇది అన్ని సంస్థలకు వర్తింపజేయలేదు. ఇక జర్మనీ బాటలోనే జపాన్ కూడా పయనిస్తోంది. జపాన్ ప్రభుత్వం కూడా సంచలనాత్మక రీతిలో వారానికి నాలుగు రోజులే పనిదినాలు అంటూ కీలక సిఫారసులు చేసింది. కుటుంబం, ఉద్యోగం మధ్య వ్యక్తులు సమతుల్యత సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. జనాభా పెరుగుదల లేకపోవడం జపాన్ లో ఓ సమస్య. అధిక పనిగంటల ఒత్తిడితో కుటుంబ సభ్యులు కలుసుకునే సమయం తగ్గిపోతోందని జపాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నాలుగు రోజుల పనిదినాలను అమలు చేస్తే, ఉద్యోగులు తమ కుటుంబంతో గడిపేందుకు అత్యధిక సమయం లభిస్తుందని, తద్వారా మానసికంగా ఉద్యోగులు ఎంతో తాజాగా ఉండేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సంస్థలకు ప్రతిపాదనలు చేసింది. నాలుగు రోజుల పనిదినాలు మినహాయించి మిగిలిన ఖాళీ సమయంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచుకునే వీలుంటుందని, ప్రజలు హాయిగా తిరుగుతూ షాపింగ్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుందని జపాన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, పెళ్లికాని వారైతే ఈ ఖాళీ సమయంలో పెళ్లి ఆలోచనలు చేసి, తగిన భాగస్వామిని వెదికి జీవితంలో స్థిరపడతారని, తద్వారా జనాభా పెరిగేందుకు ఇదొక మార్గం అవుతుందని తలపోస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more