ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పోందిన బెయిలును రద్దు చేయాలంటూ వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఇవాళ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేస్తూ పసలేని పిటీషన్ ను కొట్టేయాలని కోరిన విషయం తెలిసిందే. అయితే, ఆ కౌంటర్ పై రఘురామకృష్ణరాజు ఇవాళ రిజాయిండర్ దాఖలు చేశారు. కౌంటర్ లో వైఎస్ జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమని తెలిపారు.
తనతో పాటు అక్రమాస్థుల కేసులో వున్న సహనిందితులకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత లబ్ది చేకూర్చే పనులను చేస్తూ వారిని ప్రభావితం చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన రిజాయిండర్ లో పేర్కోన్నారు. ఈ మేరకు ఇవాళ న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడెవిట్ లో ఆయన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో వున్న పలువురు నేతల పేర్లను ఊటంకిస్తూ వారికి ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేకూర్చిన లబ్దిని కూడా పోందుపర్చారు. జగన్ అక్రమాస్థుల కేసులో సహ నిందితుడిగా ఓ కేసులో వున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా పదవిని కల్పించారని ఆయన తన రిజాయిండర్ అఫిడెవిట్ లో పేర్కోన్నారు.
అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకునే అధికారాన్ని జగన్ ప్రభుత్వం అందించారని పేర్కోన్నారు. ఇక అక్రమ కేసుల వ్యవహారంలో పార్టీ నేత మోపిదేవి వెంకటరమణను ముందుగా రాష్ట్ర మంత్రిగా ఏర్పాటు చేశారని, ఆ తరువాత ఆయనను రాజ్యసభకు పంపుతూ ప్రమోట్ చేశారన్నారు. ఇక మరో సహ నిందితుడైన వైవి సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని కట్టబెట్టారని పేర్కోన్నారు. ఇక జగన్ అక్రమాస్థులలో సాక్షులుగా వున్న అధికారులకు ఏడాది పూరైన నేపథ్యంలో ఇచ్చే అప్రైసల్ విషయంలోనూ పలు మార్పులు చేయడంతో వారిని కూడా ప్రభావితం చేస్తున్నారని ఆయన అఫిడెవిట్ లో పేర్కోన్నారు.
పిటిషన్ విచారణ అర్హతలపై కోర్టులు ఇప్పటికే స్పష్టతనిచ్చాయని వివరించిన ఆయన.. తనపై ఉన్న సీబీఐ కేసులను ప్రస్తావించలేదని జగన్ పేర్కొనడం సరికాదన్నారు. తనపై కేవలం ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన వివరించారు. జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. కాగా, వాదనలకు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచారణను వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more