2016 నవంబర్ 8న అప్పటి పెద్దనోట్లు రద్దు చేసిన నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఆ వెనువెంటనే అంతకుమించిన పెద్ద నోటును చెలామణిలోకి తీసుకువచ్చి అప్పుడే ఐదేళ్ల కాలం కావస్తోంది. అయితే 2016లో అత్యధికంగా కనిపించిన ఈ నోట్లు.. ఆ తరువాత క్రమంలో చలామణిలో లేకుండా పోయాయి. మరీ ముఖ్యంగా మినీభారత్ ఎన్నికల సమయంలో ఈ నోట్లు కనిపించడం లేదంటూ పార్లమెంటులో ఎంపీలు ప్రశ్నలు కురిపించగా.. లేదు అన్ని చలామణిలోనే వున్నాయని, అయితే పెద్దనోట్లు ప్రజలు దాచుకోవడం వల్లే ఆ నోట్లు చలామణిలో తక్కువగా కనిపిస్తున్నాయని అప్పటి అర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా వ్యాఖ్యానించారు.
ఇక ఈ నోటు చలామణిలోకి వచ్చినప్పటి నుంచి ఓ సారి అవును.. ఓ సారి కాదు అన్నట్టుగా ఈ నోటును కూడా రద్దు చేస్తారన్న లీకులు రావడం.. కాదని కేంద్రం స్పష్టం చేయడం.. దీంతో ఈ నోట్లను పేదలు, మధ్యతరగతి వారు తమ వద్ద నిలువ ఉంచుకోవాలన్నా భయపడాల్సిన సరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయితే ఈ లీకులు, క్లారిటీత మధ్యలో ఈ నోట్లను కుప్పలు తెప్పులుగా బడాబాబులు సమీకరించి.. తమ ఖజానాల్లో దాచుకున్నారని అరోపణలు కూడా వున్నాయి. అయితే తాజాగా ఈ నోటు మళ్లీ చలామణిలో కనిపించకుండా పోయిందని ఓ ఎంపీ పార్లమెంటులో ప్రశ్నించారు.
దీంతో ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. నోట్ల రద్దు తర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను గత రెండేళ్లుగా నిలపివేసినట్లు అధికారికంగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం ఆపివేసినట్లు సోమవారం జరిగిన లోక్సభ సమావేశాల్లో ఆయన కేంద్రం ప్రకటించారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more