(Image source from: Financialexpress.com)
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలకు వ్యవసాయ రంగాన్ని అప్పగించేలా వుందని.. ఇది తమ స్వేఛ్చకు విఘాతం కలిగిస్తూ కార్పోరేట్లకు అధిపత్యం వహించేలా వుందని నిరసిస్తూ రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు దేశంలోని ఏకంగా 24 రాజకీయ పార్టీలు, పలు బ్యాంకు యూనియన్లు, కార్మిక సంఘాలు కూడా మద్దతునివ్వడంతో దేశవ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బంద్ కారణంగా రైతులు రోడ్డెక్కి కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.
బంద్ కారణంగా ప్రజా జీవితం ఎక్కడికక్కడ స్థంభించింపోయింది. పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ ను ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరిమితం చేస్తుండగా, పలు రాష్ట్రాల్లో మాత్రం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తున్నారు. రైతు సంఘాలు కూడా నాలుగు గంటల భారత్ బంద్ కే పిలుపునిచ్చాయి, అయితే బంద్ కారణంగా దేశంలోని అన్ని జాతీయ రహదారులపైకి రైతులు, రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు కదిలివచ్చాయి, దీంతో ఎక్కడిక్కడ రహదారుల దిగ్భంధనం కొనసాగుతోంది. ఇక రహదారుల దిగ్భంధనంతో వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు, బ్ాయంకులు, దుకాణాలు, బడ్డీ దుకాణాలు, చిరువ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.
మహారాష్ట్రంలోని బుల్దానాలో భారత్ బంద్ లో భాగంగా నిరసన తెలుపుతున్న రైతులు రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సంఘాలకు మద్దతుగా బుల్దానా లోని స్వాభిమాని షెట్కారీ సంఘటన సభ్యులు చెన్నై- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలును మల్కాపుర్ రైల్వేస్టేషన్ వద్ద నిలువరించారు, కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, ఈ క్రమంలో రగంలోకి దిగిన రైల్వే, మహారాష్ట్ర పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు, వీరితో పాటు సంఘటన నేత రవికాంత్ తుప్ కర్ ను అదుపులోకి స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు, రైతు సంఘాల పిలుకు కదిలిన మహారాష్ట్ర రైతులు నవి ముంబై, నాసిక్, ధూలే, పూణే, షోలాపూర్ లలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా స్వచ్ఛంగా బంద్ చేశారు.
సామాజిక కార్యకర్త అన్నా హజారే రైతులకు మద్దతుగా ఒక్కరోజు పాటు నిరాహార దీక్షను చేపట్టారు, తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్దిలో ఆయన ఈ దీక్షను చేపట్టారు, ఈ బంద్ ను దేశవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. తద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి రైతుల హక్కులను కాలరాసే బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అటు మధ్యప్రదేశ్ లోనూ హోషన్గాబాద్ జిల్లాలో భారత్ బంద్ పిలుపులో భాగంగా రైతు సంఘాలు సియోనీ-మాల్వా జాతీయ రహదారి దిగ్భంధనం చేశారు. అటు దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు గృహనిర్భంధంలో ఉంచాయి. ఆయన రైతు సంఘాలను కలిస్తే వారిని రెచ్చగోట్టే అవకాశం వుందన్న నేపథ్యంలో పోలీసు బలగాలు ముందస్తు చర్యలకు ఉప్రక్రమించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more