పావలా, అర్థం కోసం మర్డర్ చేసే రోజులు పోయాయని అనుకుంటే పోరబాటే. ఎప్పుడో నలబై, యాభై ఏళ్ల క్రితం ఇలాంటి మాటలు వినివుంటాం కానీ.. ఈ రోజుల్లో వాటికి చెల్లుబాటు లేకపోవడంతో ఎవరు వాటి కోసం ప్రాణాలు తీసే కసాయిలుగా మారడం లేదు. ఇంతవరకు ఒకే కానీ ముఫై ఏళ్ల క్రితం కూకట్ పల్లిలోని ఓ హోటల్ లో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి క్షణికావేశంలో కేవలం ఇరవై పైసల కోసం ప్రాణాలు తీసిన ఘటన చాలా మందికి తెలియదు. అయితే అ ఘటనను పక్కన బెడితే తాజా పరిస్థితుల్లో కేవలం రూ. 20 కోసం ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
తర 13 ఏళ్ల కుమారుడి ముందే తండ్రిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్లాస్టిక్ పైపుతో కోడుతుంటూ.. అక్కడి జనాలు నిశ్టేష్టులై చూశారే తప్ప.. ఆ చిన్నారికి అర్థనాధాలు విని చలించే హృదయాలే కరువయ్యారు. చివరకు తన తండ్రిని కొట్టవద్దంటూ ఆ చిన్నారి దాడి చేస్తున్న ఇద్దరి వ్యక్తుల కాళ్లపై బడి ప్రాధేయపడినా లాభం లేకపోయింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర ఢిల్లీలో భార్య, పిల్లలతో కలిసిన 38 ఏళ్ల రూపేశ్ నివసిస్తున్నాడు. క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. షేవింగ్ కోసం దగ్గర్లో ఉన్న సెలూన్ కు రూపేశ్ వెళ్లాడు. షేవింగ్ పూర్తైన తర్వాత రూ. 50 ఇవ్వాలని సెలూన్ ఓనర్ సంతోష్ అడిగాడు.
అయితే సంతోశ్ కు రూపేశ్ రూ. 30 ఇచ్చి, మిగిలిన రూ. 20 తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో వివాదం ప్రారంభమైంది. సంతోశ్, అతని సోదరుడు సరోజ్ ఇద్దరూ తమ సెలూన్ లో ఉన్న ప్లాస్టిక్ పైపుతో రూపేశ్ ను బాదారు. ఈ దాడిని ఆపేందుకు రూపేశ్ కొడుకు ప్రయత్నించాడు. ఈ దాడికి సంబంధించిన మొబైల్ వీడియో కూడా బయటకు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న జనాలు దాడిని చూస్తున్నారేకాని... ఆపేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. రూపేశ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు, సంతోశ్, సరోజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more