మహమ్మారి కరోనా విజృంభన కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థల తరగతులు ఈ ఏడాది ఎలాంటి ఫీజల పెంపుకు పాల్పడకూడదని, అలాగే ఎలాంటి డోనేషన్స్ తీసుకోకూడదని, పీజలు కూడా నెలవారీగా మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం అదేశించింది. ఈ ఫీజుల వ్యవహారంపై స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా ముఖంగా పాఠశాలల యాజమాన్యాలకు అదేశాలు ఇచ్చారు. అయితే స్వయంగా సీఎం అదేశాలు జారీ చేసినా ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాల యాజమాన్యాలు మాత్రం తమ దారి తమదేనని, తమకు ఎవరి అదేశాలు వర్తించవని ఏకంగా చేతలతోనే ప్రకటిస్తున్నాయన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినీ నటుడు శివ బాలజీకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో మానవ హక్కుల కమీషన్ జిల్లా విద్యాశాఖ అధికారికి నోటీసులు జారీ చేసింది. నటుడు శివబాలాజీ పిర్యాదు మేరకు మణికోండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ పాఠశాల యాజమాన్యంపై తగు విచారణ చేసి తమకు నివేదిక అందజేయాలని అదేశించింది. పాఠశాలపై సమగ్ర విచారణ చేసిన రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని అదేశించింది. దీంతో మౌంట్ లిటేరా జీ స్కూలు ఫీజలు పెంచిందా.? అన్న విషయం కూడా వెలుగులోకి రానుంది. దీంతో పాఠశాలపై ప్రభుత్వం కూడా తమ అదేశాలను లక్షపెట్టని కారణంగా చర్యలు తీసుకునే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.
ఇక హెచ్ఆర్సీలో పిర్యాదు సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ ‘మౌంట్ లిటేరా జీ స్కూల్’ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అధిక మొత్తంలో డబ్బు వసూళ్లు చేస్తున్నారని అరోపించారు. అనుమానం రాకుండా ఉండేందుకు అనవసరంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకని ప్రశ్నించినందుకు తన పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినకుండా ఐడీలను బ్లాక్ చేసింది. దీనిపై యాజమాన్యాన్ని హెచ్చరిస్తే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. దీంతో తన పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా ఆయన హెచ్ఆర్సీలో లో ఫిర్యాదు చేశానన్నారు. ఆ స్కూలు యాజమాన్యం బలవంతంగా ఫీజులను వసూలు చేస్తోందని, ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more