కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్తుల కొంగుబంగారం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామికి దర్శనానికి క్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఇక ఆర్జిత సేవా కార్యక్రమాలను కూడా పునరుద్దరించే పనిలో పడిన తిరుమల తిరుపతి బోర్డు.. భక్తులను కూడా ఈ సేవలకు పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాలు భక్తుల పాలిట బంపర్ ఆపర్ గా మారుతున్నాయి, ఇప్పటికే అధిక ఆశ్వయుజ మాసం నేపథ్యంలో రెండు నెలల్లో రెండు పర్యాయాలు శ్రీవారి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి బోర్డు.. ఆర్జిత సేవలను నిర్వహించే భక్తులకు మరీ ముఖ్యంగా కళ్యాణసేవ చేసే భక్తులకు చక్కటి అవకాశాన్ని కల్పించనుంది.
సాధారణంగా తిరుమల శ్రీవారి కళ్యాణసేవ చేసే భక్తులకు కల్యాణం పూర్తైన తరువాత స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తారు. అయితే ఆన్ లైన్ లో కళ్యాణం చేసే భక్తులకు ఈ సేవతో పాటు దర్శనాన్ని కూడా కల్పించాలని భక్తుల వినతి మేరకు టీటీడీ ఈ వెసలుబాటును కల్పించింది. ఆన్ లైన్ లో శ్రీవారి కల్యాణం చేసిన భక్తులకు ఆ తరువాత మూడు నెలల వ్యవధిలో వారు కోరుకున్న రోజున సుపథం ద్వారా వారికి శ్రీవారి శ్రీఘ దర్శనాన్ని కల్పించేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇక డిజిటల్ కళ్యాణం చేసిన భక్తులకు ఆ తరువాత రానున్న 90 రోజుల వ్యవధిలో దర్శనం లభించినట్లు అవుతోంది.
ఇక టీటీడీ డిజిటల్ మాద్యమంగా కల్పించిన కల్యాణోత్సవం సేవను ఈ నెల 7 నుంచి టీటీడీ ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. గత మూడు రోజుల్లోనే మొత్తంగా 8,330 మంది భక్తులు ఆన్ లైన్ ద్వారా కల్యాణోత్సవ సేవను నిర్వహించారని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి. కల్యాణోత్సవ సేవను చేసినవారందరికీ ఉత్తరీయం, రవిక, కల్యాణం అక్షింతలు, కలకండ ప్రసాదాన్ని తపాలా శాఖ ద్వారా టీటీడీ పంపుతోంది. ఇకపై కల్యాణోత్సవం చేయించే భక్తులు, టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 90 రోజుల్లోగా స్వామివారి దర్శనానికి రావచ్చని, సుపథం ప్రవేశమార్గం ద్వారా వీరికి ఉచితంగా స్వామి దర్శనాన్ని కల్పిస్తామని ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more