భాగ్యనగరంగా బాసిల్లిన హైదరాబాద్ పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. కరోనా నేపథ్యంలో బీరాలు పోయిన పాలకులు.. శాసనసభలో సవాల్ విసిరినా.. చివరాఖరున గణంకాల తారుమారు చేసినా.. నగరంపై మాత్రం కరోనా విజృంభన అనుకున్న దానికంటే అధికంగానే వుందన్నది కాదనలేని సత్యం. ఇక కరోనా నేపథ్యంలో తొలినాళ్లలో ప్రతీ పక్షం రోజులకో పర్యాయం ప్రజల ముందుకు వచ్చి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై విశ్లేషించిన పాలకులు.. ఆ తరువాత అసలు కనిపంచడం తగ్గించారు. దీంతో పాలకులు కనిపించడం లేదంటూ విపక్షాలతో పాటు సోషల్ మీడియా కూడా అనేక సెటైరికల్ పోస్టులు పెట్టింది.
ప్రభుత్వం చూపుతున్న గణంకాలను పరిగణలోకి తీసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో అది నుంచి ఇప్పటివరకు కేవలం వేల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. కానీ తాజాగా జరిపిన పరిశోధనల్లో ఏకంగా లక్షల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయని వెల్డైంది, కేవలం 35 రోజుల వ్యవదిలోనే ఈ మేరకు కేసులు నమోదయ్యాయని కూడా తెలుస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మురుగునీటిలోని యాంటీబాడీలపై సంయుక్తంగా చేసిన పరిశోధనల ఫలితాలు వెల్లడికాగా, వాటి నుంచి ఈ మేరకు ఫలితాలు విశ్లేషించబడ్డాయి.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఇంచుమించు సమానంగా ఉందని వెల్లడైంది. లక్షణాలు లేకుండానే ఎక్కువమంది దీని బారిన పడి.. దాని నుంచి కోలుకున్నారని తాజా అధ్యయనంలో తేలింది. కరోనా సోకినవారి ముక్కు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్ బహిర్గతమవుతుంది. దీంతో వైరస్ వ్యాప్తి తీరును నిర్ధారించేందుకు మురుగునీటి పరీక్షల అంశంపై హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు పరిశోధన చేపట్టాయి. నగరవ్యాప్తంగా నిత్యం 1800 మిలియన్ లీటర్ల మురుగు వస్తుండగా.. 760 మిలియన్ లీటర్లనే (40 శాతం) మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో(ఎస్టీపీల్లో) శుద్ధి చేస్తున్నారు. వీటిలో 80 శాతం కేంద్రాల వద్ద 35 నమూనాలను సేకరించి సీసీఎంబీలో పరిశీలించాగా ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more