Pranab Mukherjee's health has 'worsened' క్షీణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం

Pranab mukherjees health has worsened stays on ventilator says hospital

Pranab Mukherjee, Ventilator, health condition, former president, Army Research and Referral Hospital, brain surgery, COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, India coronavirus cases

Former President Pranab Mukherjee, who is admitted to an army hospital in Delhi, has not shown any improvement in his health post the surgery, said the hospital treating him on Tuesday, adding that his condition has 'worsened and he remains 'critical' and on life support.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి మరింత విషమం..

Posted: 08/12/2020 12:24 AM IST
Pranab mukherjees health has worsened stays on ventilator says hospital

(Image source from: Tribuneindia.com)

మాజీ  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని  ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్‌ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి  సోమవారం బ్రెయిన్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.

ప్రణబ్ ముఖర్జీ మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో  ఆయనకు క్లిష్టమైన ఆపరేషన్ చేశామని అసుపత్రివర్గాలు వెల్లడించాయి, చికిత్స తరువాత కూడా ఆయన పరిస్థితి విషమయంగా ఉందని వెంటిలేటర్ పై ఉన్నారని మంగళవారం విడుదల చేసిన మెడికల్ బులిటెన్ లో పేర్కోన్నాయి. ఇక మరోవైపు ప్రణబ్ ముఖర్జీకి కరోనా వైరస్ కూడా సోకిందని ఇటీవలే నిర్ణారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ తరుణంలో తనను గత వారం రోజులుగా కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. 84 ఏళ్ల ప్రణబ్‌ డాక్టర్ల సూచన మేరకు న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.  కాగా, ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles