(Image source from: Twitter.com/ANI)
రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శత్రుత్వానికి స్థానం లేదని రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. తన మాజీ బాస్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ తనను ఓ నేతగా గుర్తించకపోయినా.. చౌకబారు అరోపణలు, విమర్శలు చేశారని.. అవి ఆయనను బాధించాయని తెలిపారు. గెహ్లాట్ తనను పనికిరానివాడని దూషించినా, బీజేపితో కలిసి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నానని ఆరోపించినా ఆయనను గౌరవిస్తానని సచిన్ తెలిపారు. ఇతరులతో సహా, తన బద్ధ శత్రువులను తాను ఎంత వ్యతిరేకించినా వారి పట్ల తాను అలాంటి మాటలు ఉపయోగించనని తెలిపారు.
అలాంటి విలువలను తాను తన కుటుంబం నుంచి పొందానన్నారు. తాను రాజకీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవన విధానంలో కానీ తన విలువలకు కట్టుబడే వుంటానని పైలట్ అన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ తనకంటే పెద్దవారు, వ్యక్తిగతంగా ఆయనను తాను ఎంతో గౌరవిస్తానని అన్నారు. పని, పాలనాపరమైన వ్యవహారాలలో తన అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు ఉందని అన్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తనన్నెంతో బాధించాయన్నారు. కాగా, వాటిపై ఇప్పుడు తాను స్పందించాలనుకోవడం లేదని అన్నారు. మాట్లాడేటప్పుడు సరైన భాషను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఇతరుల గురించి బహిరంగంగా మనం వ్యాఖ్యలు చేసేప్పుడు దానికి భాషాపరమైన లక్ష్మణ రేఖ ఉంటుందన్నారు.
గత ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఆ లక్ష్మణ రేఖను తాను ఎప్పుడూ దాటలేదని అన్నారు. నెల రోజుల క్రితం అశోక్ గహ్లోట్ తో విభేదించి, మరో 18మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బావుటా ఎగురువేసిన పైలట్ తొలి నుంచి తాను బీజేపితో చేతులు కలపలేదని చెబుతూనే వస్తున్నారు. అయితే సోమవారం కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతో సచిన్ పైలట్ భేటీ అయ్యారు. తన వర్గం డిమాండ్లను వారు ఎంతో ఓపిగ్గా విన్నారని, వాటిని పరిష్కరిస్తామని మాట ఇచ్చినట్లు సచిన్ వెల్లడించారు. దీంతో రాజస్థాన్లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు నిన్నటితో తెరపడిన సంగతి తెలిసిందే. తాను చివర వరకు పార్టీలోనే కొనసాగనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన చర్చల అనంతరం పైలట్ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more