కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన తరువాత 24 గంటలు తిరగకముందే భారత మాజీ ఫుట్ బాల్ స్టార్ మెహతాబ్ హోసియాన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేసుందుకు, వారికి దగ్గరయ్యేందుకే తాను రాజకీయాల్లో చేరుతున్నానని ప్రకటించిన ఆయన ఒక్క రోజు కూడా తిరిగితిరక్క ముందే.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. బీజేపి పార్టీకి, ఆ పార్టీ సభ్యత్వాన్ని వదిలివేశాడు. తాను రాజకీయాలనే పూర్తిగా వదిలేస్తున్నానంటూ ప్రకటించాడు. కోల్ కతా మైదాన్ లో 'మిడ్ ఫీల్డ్ జనరల్'గా గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెహతాబ్ కు రాజకీయం మహా డేంజర్ గేమ్ అని తెలుసుకునేందుకు పెద్దగా సమయం పట్టలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
తాను అడే గేమ్ లో ప్రత్యర్థులు ఏక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో కూడా తెలిసి వారిని ఎలా ఎదర్కోవాలన్న విషయం కూడా పక్కగా తెలిసిన మొహతాబ్ కు రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులు ఎక్కడ వుంటారో.. ఎలా వుంటారో.. స్వపక్షంలో వుంటారా.? లేక ప్రతిపక్షంలో వుంటారా..? అన్న విషయం తెలుసుకునేందుకు పెద్దగా సమయం పట్టలేదు అందుకనే తాను చేరిన పార్టీ నుంచి అంత త్వరగా వెనక్కి వచ్చేసి.. రాజకీయాలకు ఓ పెద్ద సలామ్ కోట్టేశాడు. తాను తీసుకున్న నిర్ణయం కేవలం వ్యక్తిగతమైనదేనని స్పష్టం చేశారు. ఇక ఈ వ్యక్తి గత నిర్ణయం తీసుకునేందుకు తనను అభిమానించే అభిమానులు అన్ని పార్టీలలోనూ వుండటం కూడా ఓ కారణంగా పేర్కోన్నాడు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ను కలిసి మంగళవారం తాను బీజేపీలో చేరుతున్నట్టు మెహతాబ్ ప్రకటించారు. మురళీధర్ సేన్ లేన్ కార్యాలయానికి వచ్చి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆయన, 'భారత్ మాతా కీ జై' అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, కాషాయ కండువా కప్పుకున్నారు. ఆపై ఒకరోజు కూడా గడవకముందే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగుతున్నట్టు ప్రకటించారు. "నేను నేటి నుంచి ఏ రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తిని కాను. నా చర్యలతో నా మేలు కోలేవారికి ఇబ్బంది కలిగించి వుంటే క్షంతవ్యుడను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఒత్తిడీ లేదు. ఇకపై నేను రాజకీయాల్లో కొనసాగబోను" అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో మెహతాబ్ ప్రకటించారు.
అంతకుముందు రోజు మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు దగ్గరవ్వాలని భావిస్తున్నానని, అందుకే రాజకీయాలను ఎంచుకున్నానని అన్నారు. ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇంత అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రావాలని భావించానని తెలిపిన ఆయన, బీజేపీలో చేరిన తరువాత మాట మార్చారు. ప్రజలు తనను ఓ రాజకీయ నాయకుడిగా చూడాలని భావించడం లేదని, వారి మనోభావాలను తాను గౌరవిస్తానని అన్నారు. కాగా, భారత్ తరఫున 30 మ్యాచ్ లు ఆడిన మెహతాబ్, రెండు గోల్స్ చేశారు. 2018-19 సీజన్ లో మోహన్ బగాన్ క్లబ్ తరఫున ఆడిన తరువాత, ఆటకు గుడ్ బై చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more