(Image source from: Telugu.samayam.com)
కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్న వినతుల పరిగణలోకి తీసుకుని అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రం నుంచి వచ్చిన తాజా అదేశాల నేపథ్యంలో పునరాలోచనలో పడింది. దీంతో రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్టులో నిర్వహించనున్నామని తెలిపింది. చివరి సెమిస్టర్ పరీక్షలు ఎ్టటి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహణ లేకుండా ఉత్తీర్ణులను చేయరాదన్న నిబంధనల నేపథ్యంలో ఈ విషయాన్ని పరీశీలించిన పిమ్మట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు, విద్యా సంస్థలకు పరీక్షలు నిర్వహించుకునేలా అనుమతులను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆగస్టు మాసంలో డిగ్రీ, పీజీ, బిటెక్, ఎంటెక్, ఎంబిఏ, ఎంసీఏ, బిఫార్మ సహా మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. అయితే ఈ పరీక్షల నిర్వహణ కేవలం చివరి సెమిస్టర్ విద్యార్థులకు మాత్రమే. దీంతో పరీక్షల నిర్వహించరాదని దాఖలైన పిల్పై ఈ నెల 9న హైకోర్టులో విచారణ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. తాజాగా యూజీసీ సైతం చివరి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పినందున అవసరమైన జాగ్రత్తలు తీసుకొని వాటిని నిర్వహిస్తామని చెప్పనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. పరీక్షలు నిర్వహించాలంటే విద్యార్థులకు కనీసం రెండు మూడు వారాల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టులో పరీక్షలు జరపాలని నిర్ణయించారు.
అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజా అదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకోన్న పరిస్థితుల దృష్ట్యా.. తాము ఇప్పుడప్పుడే జాబ్స్ లో చేరేందుకు వీలు పడదని, దీంతో ఆలస్యమయ్యే కోద్ది పరిస్థితులు ఎలా మారుతాయోనన్న అందోళనకు క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపికైన విద్యార్థుల్లో నెలకోంది. ఇప్పటికే కంపెనీలు ఫోన్లు చేసి ఎప్పుడు చేరతారని అడుగుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇప్పుడు చెన్నై, బెంగళూరు, పుణె తదితర నగరాల్లో కొలువుల్లో చేరినా మళ్లీ పరీక్షల కోసం రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు చేయరని కొందరు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more