Petrol, diesel price increased on 20th day వరుసగా 20 రోజులుగా పెరుగుతున్న ఇం'ధనం'..

Petrol diesel prices increased again on consecutive 20th day

petrol, diesel, petrol price, diesel price, petrol price hike, diesel price hike, fuel prices in india, Dharmendra Pradhan, GST, Value Added Tax, VAT, Excise Duty on petrol

Delhi saw 21 and 17 paise hike petrol and diesel prices, respectively, in Delhi on Friday. Diesel still remains costlier than petrol for the second consecutive day, with a litre of petrol costing Rs 80.13 and diesel Rs 80.19 in the national capital.

వరుసగా 20 రోజులుగా బాదేస్తున్న ఇంధన సంస్థలు.. స్పందించని కేంద్రం..

Posted: 06/26/2020 01:24 PM IST
Petrol diesel prices increased again on consecutive 20th day

(Image source from: Outlookindia.com)

అంతర్జాతీయంగా క్రూడ్ ఇంధనాని డిమాండ్ పేరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు కూడా క్రమంగా పెరుగుతూ.. ఏకంగా రెండేళ్ల గరిష్టస్థాయిని కూడా అందుకుని మరింతపైకి ఎగబాకుతున్నాయి. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ పన్నులు, వ్యాట్ ధరలు కలుపుకుని ఏకంగా 64శాతం మేర పొందుతున్నాయని, ఇక వాహనదారుడికి మాత్రం అంతర్జాతీయ మార్కట్ ధరల లభ్దిని చేకూర్చకుండా.. వాయింపులను మాత్రం మోయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. సంస్థలు ధరల పెంపుపై వెనక్కు తగ్గడం లేదు. గతంలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 100 ప్లస్ డాలర్ల చేరిన సందర్భాల్లోనూ మన దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఇదే క్రమంలో వరుసగా పదిహేడు రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి.

గత పందోమ్మిది రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్ ధర ఏకంగా డీజిల్ ధరతో సమానంగా ఎగసింది. మరో విధంగా చెప్పాలంటే పెట్రోల్ ధరను కూడా మించిపోయింది. దేశరాజధానితో పాటు పలు నగరాల్లో.. చరిత్రలోనే తొలిసారిగా డీజిల్, పెట్రోల్ ధరల మధ్యనున్న వత్యాసం పోయి.. డీజిల్ ధరకు రెక్కలు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీలో ఇలాంటి పరిణామం చోటుచేసుకువడం ఇదే తొలిసారి. కాగా దేశంలో అన్ లాక్ 1.0ను జూన్ 7 నుంచి అమల్లోకి రాగా, అదే రోజు నుంచి వరుసగా ఇరవై రోజులుగా ఇంధన ధరలు కూడా మారుతూవస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఈ ఇరవై రోజులో క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వాహనదారులకు ఆ లబ్దిని కల్పించని ఇంధన సంస్థలు.. వరుసగా ఇరవై రోజులుగా ధరలను పెంచుతూనే వున్నాయి.

కాగా గత ఇరవై రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలు ఇవాళ పెట్రోల్ దరపై 21 పైసలు, డీజిల్ ధరపై మాత్రం 17 పైసల మేర పెంపును విధించింది. డీజిల్ ధర పెంపుతో నిత్యావసర సరుకులతో పాటు ప్రజారవాణ వ్యవస్థలపై కూడా ప్రభావం చూపి తద్వారా వాటి చార్జీలు పెరుగుతున్నా.. కేంద్రంతో పాటు ఇంధన సంస్థలు మాత్రం డీజీల్ ధరలకు రెక్కలు తొడిగే ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్ పై తొమ్మిది రూపాయల డెభై ఏనమిది పైసలు మేర రూపాయలు ధర పెరగ్గా, డీజిల్ పై రమారమి పదకొండు రూపాయల మేర దర పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి. ఏకంగా ఇరవై రోజులుగా ధరలు పెరుగుతున్నా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ కానీ, లేక ప్రధాని సహా కేంద్రమంత్రులు ఎవ్వరూ స్పందించకపోవడం వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలపై పెట్రోల్ ధరల భారం కూడా అధికమవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ.80.13గా ఉండగా, డీజిల్ ధర రూ.80.19గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.82, డీజిల్ ధర రూ. 75.34, ముంబైలో పెట్రోలు ధర రూ.86.91, డీజిల్ ధర రూ.78.51, చెన్నైలో పెట్రోల్ ధర రూ.83.37, డీజిల్ ధర రూ.77.44గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.82.96కి చేరింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.83.53కు చేరింది. డీజిల్‌ ధర కూడా రూ.78.69కు ఎగసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles