COVID-19 | 85 fresh cases reported in AP ఏపీలో 3330 చేరిన కరోనా కేసులు.. 60 మరణాలు

Coronavirus in ap 85 new covid 19 cases state tally reaches 3330

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh rose to 3330 after 85 new cases were reported in the last 24 hours, out of which 2037 have so far recovered and have been discharged, while 60 have died, the state health department said.

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. 33వందలకు చేరిన కేసులు

Posted: 05/29/2020 06:38 PM IST
Coronavirus in ap 85 new covid 19 cases state tally reaches 3330

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. ఈ నెల ప్రారంభంతో కాసింత వేగాన్ని తగ్గించుకున్న కరోనా వ్యాప్తి.. మళ్లీ విజృంభిస్తోంది. 85 కేసులు నమోదయ్యాయి. ఇక అంతకుముందు వారం పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. తాజాగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 85 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా నమోదైన 85 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3330 మార్కును చేరువలో వుంది. ఈ మేరకు భారత వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా నమోదైన కేసుల్లో 33 మంది రాష్ట్రవాసులకు పాజిటివ్ నిర్థారణ కాగా, మిగతావారంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులుగా పేర్కొంది. ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 111 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కాగా రాష్ట్రంలో తాజాగా కర్నూలు జిల్లాలో మరో వ్యక్తి కరోనా బారినపడి చికిత్స పోందుతూ మరణించాడు. ఇక కరోనా బారినపడి మరొకరు మృతిచెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 60కి చేరింది. కాగా కరోనా వైరస్ బారినపడిన పడి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నవారు కూడా అదే సంఖ్యలో వున్నారు.

రాష్ట్రంలో కొత్తగా నమదైన పాజిటివ్ కేసుల్లో తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు మార్కెట్ సంబంధాలు వున్నాయని సమాచారం. తాజాగా నమోదైన 85 కేసుల్లో నాలుగు కేసులు కూడా మార్కెట్ తో వచ్చిన కాంటాక్టు కేసులని అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2037కు చేరడం కూడా రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. ఇక తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో కరోనా బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య 777గా ఉంది. ఈ తరుణంలో జూన్ మాసం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాలంలో కరోనా వ్యాప్తికి మరింత అనుకూలంగా వుంటాయన్న అంచనాలతో రాష్ట్రవాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles