Nirbhaya's Mother Reacts On Priyanka Reddy case ప్రియాంక కేసు: ఖండించిన పవన్.. ఆ తల్లులూ తల్లడిల్లారు..

Pawan kalyan reacts on priyanka reddy murder case

Priyanka reddy, veterinary doctor, pawan kalyan, nirbhaya, usha devi, parvathi, prathusha, Priyanka reddy murder, priyanka reddy lorry drivers, priyanka reddy veterinary doctor, chatanpally village, madhapur, shadnagar, lorry drivers, scooty, rachakonda police, Telangana, Crime

Jana Sena Chief Pawan Kalyan has strongly condemned the heinous incident that claimed the life of a veterinary doctor, Priyanka Reddy. Pawan that the Nirbhaya act failed to create any impact on the criminals and wanted that the She teams should be strengthened more.

ప్రియాంక కేసు: ఖండించిన పవన్.. ఆ తల్లులూ తల్లడిల్లారు..

Posted: 11/29/2019 08:21 PM IST
Pawan kalyan reacts on priyanka reddy murder case

సంచలనం సృష్టించిన వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక హత్య కేసులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. మృతురాలి కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర శివార్లలో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. విద్యార్థినులు, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని పవన్ అభిప్రాయపడ్డారు.

ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్రంగా ఖండించింది. నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి దేశంలో లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పాశవిక దాడులు జరుగుతుంటే పోలీసులు, అధికార వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోందని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. తన బిడ్డలానే ప్రియాంక కూడా కామాంధుల దాహనికి బలైపోయిందని గుర్తుచేశారు.

ప్రియాంకను హతమార్చిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి ఉరి శిక్షను వేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశంలో మహిళలకు కనీస భద్రత లేకుండాపోయిందని, దీనికి కేంద్రప్రభుత్వం తగు చర్యలను తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి ఘటనలు జరకుండా ఉండాలంటే దోషులకు కఠిన శిక్షలు వేయాలని అన్నారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్న దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలు చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను ఉరి తీసేంతవరకు తమ పోరాటం ఆగదని ఆశాదేవి తెలిపారు.

డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఘటన గురించి వింటుంటే నాడు తన కూతురికి జరిగిన ఘటనే గుర్తొస్తోందని సినీనటి ప్రత్యూష తల్లి పార్వతమ్మ బాధపడ్డారు. మహిళలు బయటకు వెళ్లినప్పుడు చాలా సమయస్ఫూర్తితో, తెలివిగా వ్యవహరించాలని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయాల్లో మహిళలు తమ తల్లిదండ్రులకు, సోదరులకు, సమీపంలో వున్న స్నేహితులకు లేదా పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, మరణశిక్ష విధిస్తే మహిళా లోకం ఆనందిస్తుందని, మనోనిబ్బరాన్ని పెంచుకుంటుందని, ప్రత్యూష ఛారిటబుల్ ట్రస్టు, మహిళల తరఫున కోరుకుంటున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka reddy  veterinary doctor  pawan kalyan  nirbhaya  usha devi  parvathi  prathusha  shadnagar  scooty  Telangana  Crime  

Other Articles