తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని.. బతికొచ్చినోన్ని కాదని చెప్పారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్లం కాదని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందన్నారు. మంత్రి పదవి నుంచి తనను తప్పిస్తున్నారంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఈటల ఘాటుగా స్పందించారు.
‘ఈటల రాజేందర్ అనెటోడు తెలంగాణ గడ్డ మీద ఆత్మగౌరవంతో గల్తెత్తి బతికినోడు.. ఈ చిల్లరమల్లర వాళ్లకు భయపడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. ‘అసలోడెవ్వడో, నకిలోడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటది. దొంగలెవరో, దొరలెవరో.. తెలవాల్సిన అవసరం ఉంటది. రాజకీయాల్లో ద్రోహులెవ్వరో, మోసగాళ్లెవరో.. అసలు సిసలైన వాడెవ్వడో తెలవాల్సిన అక్కర ఉంటది. నా 50 ఏళ్ల జీవితంలో నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా.. దొంగలు, మోసగాళ్లు ఒక్కసారి ద్రోహం చేస్తారు కావొచ్చు. కానీ, ధర్మాన్ని మాత్రం ఎవడూ మోసగించలేడు. న్యాయాన్ని మాత్రం కప్పిపుచ్చలేడు. ఇది మాత్రం సత్యం’ అని ఈటల అన్నారు.
‘గెలవగలిగే సత్తా ఉన్నోడిని, అమ్ముడు పోకుండా ఉన్నోడిని నేను నా భుజాల మీద పెట్టుకొని మోసే ప్రయత్నం చేస్తా. లేనిపోనివి చెబితే మాత్రం దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను మాట్లాడితే గంటలు మాట్లాడుతా. కానీ, నాక్కూడా ఎక్కడో బాధ ఉంది. అయితే.. ఈ బాధను నా నోటి నుంచి వినడం కాదు, ఎన్నడో ఒకనాడు అన్నీ తప్పకుండా బయటకొస్తాయి. ఎవడు ద్రోహో, ఎవడు వీరుడో తెలిసే రోజు వస్తుంది’ అని ఈటల బావోద్వేగంతో చెప్పారు.
తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని.. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని ఈటల చెప్పారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని తెలిపారు. నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని.. ప్రజలే చరిత్ర నిర్మాతలని పేర్కొన్నారు. కుసంస్కారుల పట్ల, సొంతగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. తనది మొదటి నుంచి గులాబీ వర్గమేనని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more