ప్రచండ భానుడి ఉగ్రరూపంతో అల్లాడుతున్న తెలంగాణకు ఇవాళ కొంత ఉపశమనం లభించింది. ఇప్పటికే నిప్పుల కొలిమిలా ఉరిమిన భానుడి భగ భగలకు రాష్ట్రంలోని పలువరు ప్రాణాలను కోల్పోయారు. ఇక చాలిస్తాను అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకున్నాడు. దీంతో క్రమేపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే స్యూరుడు శాంతించగానే వరుణుడు ప్రకోపిస్తున్నాడు. తెలంగాణలోని పలు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో ఇన్నాళ్లు భానుడు తమ తలపై భగభగ మండుతూ నృత్యం చేస్తే.. ఇక వారుణుడు కుండపోత వర్షాలతో జనజీవనాన్ని స్థంభింపజేయడంతో పాటు పిడుగుల, ఉరుములతో భయభ్రాంతులను చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలంగాణ ప్రజలు అందోళన చెందుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భూపాలపల్లి, కరీంనగర్ తదితర కొన్ని చోట్ల వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మే 17 నుంచి మే 19 తేదీల్లో కొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక మే 15వ తేదీ బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయని వెల్లడించింది. రామగుండం, హైదరాబాద్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.
హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోతతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రాలేనంతగా వేడి సెగ కొడుతోంది. బయటకు వెళితే..వడగాల్పుల బారిన పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మే 15వ తేదీ బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43.2 డిగ్రీలు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గడం లేదు. సాయంత్రం 4 గంటల తర్వాత నగరంలో ఈదురుగాలులతో ఎండ వేడి తగ్గింది. అయినా గాలుల భయం మాత్రం ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శుభ్రంగా ఉన్న పానీయాలు మాత్రమే తాగాలని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more