ఒడిశాపై విరుచుకుపడి ప్రాణనష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఫణి తుఫాను... నెమ్మదిగా తన ఉదృత్తిని తగ్గించుకుంటూ పశ్చిమ బెంగాల్ లోకి అడుగుపెట్టింది. ఒడిశాలో ఫణి చేసిన విలయతాండవాన్ని చూసిన పశ్చిమ బెంగాల్ తీవ్ర టెన్షన్ కు గురైంది. అయితే తీవ్రనష్టం కలగించకుండానే బంగ్లాదేశ్ వైపు పయనిస్తుండటంతో బెంగాల్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఫణి ప్రభావంతో గత రాత్రి నుంచి 120 కీలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తుండటంతో చెట్లు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి.
ఏకధాటిగా కురుస్తున్న వర్షం ధాటికి వాగులు, వంకలకు ప్రవాహం పెరిగి వరదలు వచ్చే అవకాశాలు వున్నాయి. పశ్చిమ బెంగాల్ లె పిడుగులు పడటంతో ఒక వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. కాగా ఫణి తుఫాను ఒబిశాపై చూపినంత ప్రభావం తమ రాష్ట్రంపై చూపలేదని దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, ఒడిశా నుంచి పయనమైన ఫణి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో... ఉత్తరం దిశగా కదులుతూ... ఈశాన్యం వైపుగా వెళ్తి.. పశ్చిమ బెంగాల్లో మరోసారి తీరం దాటింది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ దిశగా కదులుతూ తన ఉదృతిని కోల్పోతోంది.
అయితే పశ్చిమ బెంగాల్ లో తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని... వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినట్లు గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచకపోవడం కూడా కాసింత ఉపశమనం లభించిందని అన్నారు. కాగా వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నపూర్, దిఘా, మిడ్నాపూర్ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంబించిందని అధికారులు తెలిపారు. ముందస్తుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ప్రాంతాల నుంచి 45 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.
ఫణి ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా కోల్కతాలోని హల్దియా ఓడరేవును మూసేశారు. హౌరా-చెన్నై మార్గంలోని 220 రైళ్లను రద్దు చేశారు. కోల్కతాలో స్కూళ్లకు సెలవిచ్చారు. ఇదిలావుండగా ఒడిశాపై మాత్రం ఫణి పడగ విప్పింది. పెనుతుఫాను ధాటికి 12 మంది మృత్యువాత పడ్డారు. గత మూడు దశాబ్దాలుగా వచ్చిన 4 అతితీవ్రమైన పెను తుఫాను ఇదని వాతావరణ అధికారులు పేర్కోంటున్నారు. ఫణి తుపాను ఒడిశాలో తీరం దాటి ప్రళయాన్ని సృష్టించి బంగ్లాదేశ్ దిశగా కదిలి వెళ్లిపోయానా.. ఈ ప్రాంతం మాత్రం మరో రెండు మూడు వారాలకు కానీ సాధారణ స్థితికి చేరుకునే వీలులేకుండా చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more