అధికార పార్టీలో వున్న నేతలకు అధికారం ప్రజల కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను పట్టించుకోకుండా ఐదేళ్ల పాటు అంధకారం అలుముకుంటుందన్న నానుడి ప్రచారంలో వుంది. సరిగ్గా ఆ నానుడిని నిజం చేసేలా ఓ బీజేపి మంత్రివర్యులు ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చి నాలుక ఖర్చుకున్నాడు. రాజస్థాన్ మంత్రి రాజ్కుమార్ రిన్వా మాత్రం ప్రజలకు అద్భుతమైన చిట్కా చెప్పారు.
పెరుగుతున్న పెట్రోలు ధరలు భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో వుండి ప్రజల కష్టనష్టాలు పట్టక.. ఉచిత సలహా ఇచ్చి ఊరుకున్నాడు. కేంద్రంలోని తమ బీజేపి ప్రభుత్వం మెప్పు పొందడానికి ఆయన ఈ ఉచిత సలహా ఇచ్చి.. అధిష్టానం దృష్టిలో మంచిస్థానం సంపాదించాలనుకున్నాడు కానీ.. అదే సమయంలో తనను ఎన్నుకున్న ప్రజలు మనస్సుల్ని మాత్రం గాయపరుస్తున్నానని మర్చిపోయాడు.
ఫలితంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎంత పెరుగుతున్నా ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఇంతకీ ఆయనిచ్చిన సలహా ఏంటో తెలుసా?.. ప్రజలే జాగ్రత్త పడి ఇంట్లోని మిగతా ఖర్చులు తగ్గించుకోవాలని సూచించాడు. ఇతర ఖర్చులు తగ్గించుకుంటే అసలు పెట్రోలు ధరలు భారమే కాదని పేర్కొన్నారు. పెట్రోలు ధరలు అనేవి క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.
ఓ వైపు కేరళ, కర్ణాటక సహా దేశంలోని పలు రాష్ట్రాలలో వరదలు సంభవించిన నేపథ్యంలో.. ప్రకృతి విలయానికి గురైన కేరళకు కేంద్రం వందల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుందని.. వరద బాధితులకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తోందని బోడిగుండుకు, మోకాలికి లింకేట్టేశారు. అయినా ప్రభుత్వానికి ఇంకా బోల్డంత డబ్బు కావాలని, ప్రజలు అర్థం చేసుకుని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. అయితే ఇది నిజమని నమ్మెవారూ లేకపోలేరు.. కేంద్రం తక్షణ సాయం కింద 600 కోట్ల రూపాయలను కేరళకు విడుదల చేసిందే తప్ప.. ఆ తరువాత మాత్రం ఇంకా ఎలాంటి సాయం అందించలేదన్నది వాస్తవం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more