తమిళనాడులో సిబిఐ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా తరహాలో ఏకంగా సిబిఐ అధికారులు సాక్ష్యాత్తు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ బాస్కర్ సహా రాష్ట్ర డీజిపి టికె రాజేంద్రన్ నివాసంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. వీరితో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్న అధికారులు ఎక్కడెక్కడ అన్న వివరాలను మాత్రం గోప్యంగా వుంచారు.
తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా కోట్ల రూపాయల విలువైన గుట్కా కుంభకోణం నడుస్తుందన్న వివరాలు గత ఏడాది వెలుగులోకి వచ్చిన తరువాత ఇంత పెద్దస్థాయిలో సోదాలను నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా, అక్రమ గుట్కా వ్యాపారంతో సంబంధం ఉందనే అనుమానంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టీకే రాజేంద్రన్ సహా మరికొందరు ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది.
తమిళనాడులో నమిలే పొగాకు ఉత్పత్తులను నిషేధించినప్పటికీ అమ్మకాలు కొనసాగుతుండటంపై ఈ ఏడాది ఏప్రిల్లో మద్రాస్ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేయగా వారికి ఓ డైరీ లభించింది. అందులో లంచాలు ఇచ్చిన వారి జాబితాలో పలువురు రాజకీయ నాయకులు, సీనియర్ పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో హైకోర్టు ఈ కేసును ఇటీవల సీబీఐకి అప్పగించింది. ఇప్పుడు సీబీఐ ఆ దిశగా విచారణ ప్రారంభించింది.
బ్లాక్ మార్కెట్లో నిషేధిత వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మాజీ పోలీసు కమిషనర్ ఎస్.జార్జి, ఆహార భద్రత విభాగం, సేల్స్ ట్యాక్స్ విభాగం అధికారుల ఇళ్లతో కలిపి మొత్తం 32 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపారు. 2016లో ఆదాయపన్ను అధికారులకు మాధవ రావ్ అనే వ్యాపారి కార్యాలయంలో ఆ డైరీ దొరికింది. అందులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు రూ.40కోట్ల దాకా లంచాలు ఇచ్చినట్లు ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more