కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ రాకతో.. కాంగ్రెస్ పై విమర్శలు, దేవేగౌడ్ పై ప్రశంసలు కొనసాగుతున్న తరుణంలో.. వాటిని అంతే సమర్థవంతంగా, ధీటుగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య తిప్పికొడుతూ.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం రసవత్తరంగా సాగుతనున్న వేళ.. బీజేపిపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తూ హఠాత్తుగా మరణించారు.
జయనగర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థిగా మరోమారు ఎన్నికల బరిలో నిలిచిన బీఎన్ విజయ కుమార్ (59) హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. జయనగర్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ నెల 12న జరిగే ఎన్నికల్లో గెలిచి, హ్యాట్రిక్ సాధించాలని భావించి.. దానినే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. విజయ్ కుమార్ మంచి నాయకుడని, ప్రజల కోసం, పార్టీ కోసం కృతనిశ్చయంతో పనిచేశారని బీజేపి పార్టీ తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. విజయ్ కుమార్ లాంటి నేత కొల్పోవడం పట్ల బీజేపి నేతలు పెద్దఎత్తున తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక ఎన్నికలలో ఎంతో బిజీగా వున్న మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా విజయ్ కుమార్ అకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయ్ కుమార్ తనకు మంచి మిత్రుడని, సరిగ్గా ఎన్నికల తరుణంలో ఆయన మరణించడం తనకు మరింత బాధను, అవేదనను కలిగించిందని తెలిపారు. విజయ్ కుమార్ కు జయానగర్ నియోజకవర్గం నుంచి ఈ సారి కర్ణాటక హోం మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి బరిలో నిలిచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more