జనసేన సిద్ధాంతాలు, తమ నాలుగేళ్ల ప్రయాణంపై, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై జనసేన ఆవిర్భావ దినోత్సవంగా సందర్భంగా నిర్వహించబోయే సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో సభకు తరలి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణ 35 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా భారీ బహిరంగా సభ నిర్వహిస్తుండటం, ప్రత్యక్ష రాజకీయ ప్రవేశ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత ఏపీ, తెలంగాణ, ఒడిశా నుంచి వచ్చిన 200 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా.. మరికాసేపట్లో పవన్ వేదికపై చేరుకుని ప్రసంగిస్తారు.
ఇక ఈ సభ ద్వారా తమ నేత కీలక ప్రకటనతో పాటు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం.
జనసంద్రంగా మైదానం...
అశేష అభిమానులు, కార్యకర్తలతో నాగార్జున యూనివర్సిటీ వద్ద కోలాహలం నెలకొంది. విజయవాడ వైపుగా వచ్చే వాహనాలను సాయిబాబా గుడి వద్ద పార్కింగ్ ఏర్పాటు చేయగా వీఐపీల వాహనాలను టోల్గేట్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశా రు. గుంటూరు మీదుగా రాయలసీమ, తదితర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తల వాహనాల పార్కింగ్కు కాకాని దాటిన తరువాత బైబిల్ మిషన్గ్రౌండ్ వెనకు భాగంలో, వీఐపీల వాహనాల పార్కింగ్కు రెయిన్ట్రీ పార్కింగ్ స్థలాన్ని కేటాయించామని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే రెండున్నర లక్షల మంది జన సైనికులు వేదిక వద్ద ఉండగా.. మరికొందరు దారిలో ఉన్నారు. సుమారు 5 లక్షల మంది సభకు హాజరు కావొచ్చని ఓ అంచనా.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని వెయ్యి మంది వాలంటీర్లతో మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకడ్బంది ఏర్పాట్లు చేశారు.
తాడేపల్లి నుంచి భారీ ర్యాలీ
జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా 974 మంది త్రివర్ణ పతాకధారులతో జాతీయ ఐక్యతా పాదయాత్రను నిర్వహిస్తున్నారు. పార్టీ సమన్వయకర్త ముత్తంశెట్టి కృష్ణారావు నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది. ఉదయం 8 గంటలకు వారధి ఆవల తాడేపల్లి పోలీసు స్టేషన్ ప్రాంతం నుంచి బయలుదేరే పాదయాత్ర కాజా వద్ద సభాస్థలికి చేరుకుంటుంది. సుమారు ఐదు గంటలకు ర్యాలీ చేరుకునే అవకాశం ఉంది. ఇక నవ్యాంధ్ర రాజధానిలో స్థిర నివాసం ఏర్పరుచుకోబోతున్ననిర్మించుకోబోతోన్నతొలి రాజకీయపార్టీ నాయకుడిగా పవన్ కు క్రెడిట్ దక్కనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more