మన ఘనకీర్తిని చాటుకోవడంలో మనం వేస్తున్న వెనుకంజ కారణంగా.. ప్రపంచలో అనేక విషయాలను తామే ముందుగా కనుగొన్నామని విదేశాల శాస్త్రవేత్తలు గొప్పలకు పోతుంటే ఔరా నిజమేనా అని నోళ్లు వెళ్లబెట్టడం తప్ప మరేం చేయడం లేద మనం. అయితే భూమికి సూర్యుడికి వున్న దూరాన్ని తులసీదాసు తన హనుమాన్ చాలిసీలో చెప్పినా.. దానిని హిందువులు పఠించినా.. అది చాలీసాలో భాగమనే అనుకుంటున్నారు తప్ప.. ఒక్కసారి దానిని విషదీకరించుకుని చూస్తే.. పరదేశ శాస్త్రవేత్తలు మనకన్నా ఎంత వెనుకబడ్డారో తెలిసిపోతుంది.
ఇక చైనావాళ్లు కేవలం 24 గంటల్లో వంతెన నిర్మాణం చేశారని.. సింగపూర్ వాళ్లు మరోలా చేశారని ఘనకీర్తిని చాటుకోవడంతో వినడం మాత్రమే మనవంతుగా మిగులుతున్న తరుణంలో మనమేమి తక్కువ కాదనన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కూడా తమ పనితో ఘనతను సాధించారు. అయితే ఉర్థూలో సామెత చెప్పినట్లు ఘర్ కా ముర్గీ దాల్ బరాబర్.. అన్నట్లు మనవాళ్ల ఘనతను మనమే ప్రచారం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం. ఈ ఘనతను జాతీయ, దేశీయ మీడియా పెద్ద పెద్ద అక్షరాలతో చూపడంలో శ్రద్ద చూపడం లేదు. అయితేనేం మన రైల్వే అధికారులు మాత్రం నాలుగు గంటల వ్యవధిలో అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద ఘనత చోటుచేసుకుంది. ఇందుకోసం రైల్వే అధికారులు 1.65 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగేళ్ల క్రితం 2014 జూలై 24న రైలు ప్రమాదంలో 16 మంది చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సును వేగంగా వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకోనడంతో.. ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఇంకా ఇక్కడి వారి గుండెలను గాయపరుస్తూనే వుంది.
ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణం పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్ మోతిలాల్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చొరవతో అండర్ గ్రౌండ్ వంతెన పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు ఇకపై ఎలాంటి రైలు ప్రమాద అందోళన లేకుండా హాయిగా రాకపోకలు సాగించడానికి వీలు కల్పించబడినట్లైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more